అప్పట్లో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లుగా రానించినవారిలో మీనా కూడా ఒకరు. రజినీకాంత్, చిరంజీవి కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో మీనా హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. ఆ తరవాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ మీనా ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటోంది. ఇక మీనా 2009లో వ్యాపారవేత్త విద్యాసాగర్ ను వివాహం చేసుకుంది. కాగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Advertisement
ఇక వీరికి అప్పటికే నైనికా అనే పాప జన్మించింది. ప్రస్తుతం మీనా తన కూతురు నైనికా తో కలిసి ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. ఇదిలా మీనా భర్త విద్యాసాగర్ మృతి చెందిన తరవాత మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా త్వరలోనే మీనా పెళ్లి అంటూ రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. కాగా తాజాగా ఆ వార్తల పై మీనా కూతురు నైనికా స్పందించింది.
Advertisement
మీనా ఇండస్ట్రీలోకి వచ్చి 40 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో ఆమెకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాగా ఈ కార్యక్రమంలో నైనికా ఎమోషనల్ అయ్యింది. అమ్మా నువ్వు ఈ స్థాయికి ఎదిగినందుకు గర్విస్తున్నా అని చెప్పింది. ఓ రోజు నేను షాపింగ్ మాల్ లో తప్పిపోయినప్పుడు నువ్వు ఎంత టెన్షన్ పడ్డావో నాకు తెలుసు అందుకు నన్ను క్షమించు. నువ్వు ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు.
నాన్న చనిపోయాక నువ్వు డిప్రెషన్ లోకి వెళ్లిపోయావు. మానసికంగా కూడా దెబ్బతిన్నావు. ఇప్పటి నుండి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇటీవల ప్రముఖ ఛానల్స్ లో మా అమ్మ గురించి ఫేక్ వార్తలు రాస్తున్నారు. మా అమ్మకు ఫీలింగ్స్ ఉండవా మా అమ్మ కూడా మనిషే కదా అంటూ నైనికా ఎమోషనల్ అయ్యింది. ఇక నైనికా స్పీచ్ కు రజినీకాంత్ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు.