Home » సాయితేజ కుటుంబానికి అండ‌గా మంచువిష్ణు..ఇద్ద‌రు పిల్ల‌ల‌కు ఫ్రీ ఎడ్యుకేష‌న్..!

సాయితేజ కుటుంబానికి అండ‌గా మంచువిష్ణు..ఇద్ద‌రు పిల్ల‌ల‌కు ఫ్రీ ఎడ్యుకేష‌న్..!

by AJAY
Ad

తమిళనాడులోని ఊటీ కొండ‌ల‌లో బిపిన్ రావత్ హెలికాప్టర్ కు జ‌రిగిన‌ ప్రమాదంలో 14 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతి చెందిన సిబ్బందిలో చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ గా ఆర్మీలో విధులు నిర్వ‌హిస్తున్న‌ సాయి తేజ కూడా ఉన్నారు. ప్రస్తుతం సాయి తేజ బిపిన్ రావ‌త్ కు భ‌ద్ర‌తాధికారిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే బిపిన్ రావత్ తో పాటు హెలికాప్టర్ లో ప్రయాణించిన సిబ్బందిలో సాయి తేజ కూడా ఉన్నారు. 2013లో సాయి తేజ ఆర్మీలో చేరారు. కాగా సాయి తేజ మరణంతో ఆయన కుటుంబం లో విషాద ఛాయలు అలముకున్నాయి.

Advertisement

సాయి తేజ కు ఇప్పటికే వివాహం కాదా భార్య శ్యామల కుమారుడు మోక్షజ్ఞ కుమార్తె దర్శిని ఉన్నారు. చిన్న వ‌య‌సులో దేశ‌సేవ కోసం వెళ్లిన సాయితేజ మ‌ర‌ణించ‌డంతో ఆయ‌న కుటుంబంలో విషాద చాయ‌లు అలుముకున్నాయి. అధికారిక లాంఛ‌నాల‌తో సాయితేజ‌ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సినీ హీరో మా అధ్యక్షుడు మంచు విష్ణు సాయి తేజ కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించారు. అంతేకాకుండా సాయి తేజ ఇద్దరు పిల్లల చ‌దువుల బాధ్యతను తాను తీసుకుంటానని సాయితేజ‌ సతీమణి శ్యామల కు హామీ ఇచ్చారు.

Advertisement

మంచు విష్ణు మా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడంతో పాటు తమకు ఉన్న విద్యానికేతన్ విద్యాసంస్థల బాధ్యతలను కూడా తానే చూసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాకే చెందిన మంచు విష్ణుకు జిల్లాలో విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు విద్యానికేతన్ సంస్థ ప్రతినిధులను సాయి తేజ ఇంటికి పంపించి కుటుంబాన్ని పరామర్శించాల‌ని చెప్పారు. దాంతో సాయి తేజ ఇంటికి వెళ్ళిన విద్యానికేతన్ సంస్థల ప్రతినిధులు విష్ణు సూచన మేరకు సాయితేజ కుటుంబాన్ని పరామర్శించి సాయి తేజ భార్య తో ఫోన్ మాట్లాడించారు. కాగా మంచు విష్ణు సాయి తేజ ఇద్దరు పిల్లల చదువుల బాధ్యతను పూర్తిగా తీసుకుంటానని చెప్పారు. ధైర్యంగా ఉండాల‌ని..తామంతా అండ‌గా ఉంటామ‌ని కుటుంబానికి ధైర్యం చెప్పారు.

also read : జ‌క్క‌న్న కాళ్లు మొక్కిన అలియాభట్..సంస్కారానికి వంద మార్కులు వేస్తున్న నెటిజ‌న్లు..!

Visitors Are Also Reading