Home » Mahesh Babu : ఒక్కరోజే 30 మంది చిన్నారులకు ప్రాణం పోసిన శ్రీమంతుడు….!

Mahesh Babu : ఒక్కరోజే 30 మంది చిన్నారులకు ప్రాణం పోసిన శ్రీమంతుడు….!

by AJAY
Ad

టాలీవుడ్ లోని చాలా మంది హీరోలు తమ ట్రస్ట్ ల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మెగాస్టార్ తన ట్రస్టు ద్వారా చిరంజీవి రక్తదానం, నేత్రదానం లాంటి సేవా కార్యక్రమాలను చేస్తూ ఎంతో మందికి సహాయ పడుతున్నారు. అదేవిధంగా నందమూరి హీరో బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అతితక్కువ ఫీజులతో క్యాన్సర్ లాంటి మహమ్మారికి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

ఇక టాలీవుడ్ లోని మనసున్న హీరో లలో ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఒకరు. మహేష్ బాబు తన ట్రస్ట్ ద్వారా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా మహేష్ బాబు సూపర్ స్టార్ అనిపించుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ లను ఉచితంగా నిర్వహించి గొప్ప మనసు చాటుకున్నారు.

Advertisement

Mahesh babu

Mahesh babu

కాగా తాజాగా నిన్న 30 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ జరిపించి ప్రాణం పోసారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ లో మహేష్ బాబు పౌండేషన్ తరఫున 30 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు జరిగాయి. ఈ విషయాన్ని మహేష్ బాబు భార్య నమ్రత తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దాంతో ప్రస్తుతం మహేష్ బాబు పై ప్రశంసలు కురుస్తున్నాయి. మహేష్ బాబు సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా శ్రీమంతుడు అంటూ ఫ్యాన్స్ కొనియాడుతున్నారు.

Visitors Are Also Reading