Home » మ‌హేశ్ బాబు సినిమా క‌థ ఇదే… లీక్ చేసిన విజ‌యేంద్ర‌ప్ర‌సాద్..!

మ‌హేశ్ బాబు సినిమా క‌థ ఇదే… లీక్ చేసిన విజ‌యేంద్ర‌ప్ర‌సాద్..!

by AJAY
Ad

టాలీవుడ్ స్టార్ హీరో మ‌హేశ్ బాబు తో రాజ‌మౌళి త‌న త‌దుప‌రి సినిమాను ప్ర‌క‌టించిన సంగ‌తి తెసిందే. ఇప్ప‌టికే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ మంచి విజ‌యం సాధించింది. పాన్ ఇండియా లెవ‌ల్ విడుద‌లైన ఈ సినిమాకు వ‌సూళ్ల వ‌ర్షం కురుస్తోంది. దాంతో మ‌హేశ్ బాబు తో చేయ‌బోయే సినిమా పై కూడా భారీ అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. ఇక ఈ సినిమాకు క‌థ‌ను రాజ‌మౌళి తండ్రి స్టార్ ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్రసాద్ అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

 

కాగా తాజాగా విజయేంద్ర‌ప్ర‌సాద్ ఓ ఇంట‌ర్వ్యూలో ఈ సినిమా గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ…బాహుబ‌లి సినిమా గురించి మ‌ర్చిపోవాల‌ని అన్నారు. ప్ర‌తి సినిమాను బాహుబ‌లితో పోల్చ‌వ‌ద్దు అన్నారు. ఆ సినిమా న‌చ్చిందా లేదా అన్నది మ‌న‌సును అడ‌గాల‌ని అన్నారు. బాహుబ‌లి కంటే ఆర్ఆర్ఆర్ ముందే పూర్త‌య్యింద‌ని అన్నారు.

Advertisement

కానీ క‌రోనా వ‌ల్లే సినిమా విడుద‌ల ఆల‌స్యం అయ్యింద‌ని చెప్పారు. ఇక త‌న తన త‌దుప‌రి సినిమా మ‌హేశ్ బాబుతో ఉంటుంద‌ని చెప్పారు. కేఎల్ నారాయ‌ణ ఈ సినిమాకు నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్పారు. మ‌హేశ్ బాబు కోసం క‌థ‌ను రెడీ ప‌నిచేసే ఆలోచ‌న‌లో ఉన్నాన‌ని చెప్పారు. ఇక రాజ‌మౌళికి ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో చేయాల‌ని ఉంద‌ని చెప్పారు.

ALSO READ : VIJAYENDRA PRASAD : రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు తీసిన 3 సినిమాలు ప్లాప్ అని తెలుసా ? అవేవంటే?

రాజ‌మౌళికి జంతువులు అంటే చాలా ఇష్టం అని కాబ‌ట్టి ఆఫ్రికా అడ‌వుల బ్యాక్ డ్రాప్ లోనే సినిమా చేయాల‌ని అనుకుంటున్నాడ‌ని అన్నారు. ఇక విజ‌యేంద్ర ప్రసాద్ మాట‌లు చూస్తుంటే మహేశ్ బాబు సినిమా ఖ‌చ్చితంగా ఆఫ్రికా అడ‌వుల బ్యాక్ డ్రాప్ లోనే ఉండ‌బోతుంద‌ని క్లారిటీ ఇచ్చేసింది. అంతే కాకుండా విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ విక్ర‌మార్కుడు 2 క‌థ‌ను కూడా రెడీ చేస్తున్న‌ట్టు తెలిపారు.

Visitors Are Also Reading