Home » తల్లి చివరి కోరిక తీర్చలేకపోయా అని మహేష్ బాబు కుమిలిపోతున్నారా…? ఆ కోరిక ఏంటి..?

తల్లి చివరి కోరిక తీర్చలేకపోయా అని మహేష్ బాబు కుమిలిపోతున్నారా…? ఆ కోరిక ఏంటి..?

by AJAY
Ad

సూప‌ర్ స్టార్ కృష్ణ ఇంట్లో వ‌రుస విషాదాలు చోటు చోసుకోవ‌డం వారి కుటుంబ స‌భ్యుల‌తో పాటూ అభిమానుల‌ను విషాదంలోకి నెట్టివేసింది. కృష్ణ పెద్ద కుమారుడు ర‌మేష్ బాబు కొన్ని నెల‌ల క్రితం అనారోగ్యంతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆ ఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే రీసెంట్ గా మ‌హేశ్ బాబు త‌ల్లి ఇందిరాదేవి కూడా క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఇందిరా దేవి ఏఐజీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు.

Advertisement

ఇందిరా దేవి మ‌ర‌ణ‌వార్త‌తో మ‌హేశ్ బాబు తీవ్ర‌మైన దుఃఖంలో మునిగిపోయారు. న‌మ్ర‌త సితారాలు ఇందిరాదేవిని చివ‌రిచూపు చూస్తూ క‌న్నీళ్లు పెట్టుకున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇక ఇందిరా దేవికి మొత్తం ముగ్గురు సంతానం ఉన్నార‌న్న సంగ‌తి తెలిసిందే. రమేష్ బాబు, మ‌హేశ్ బాబు కుమారులు కాగా కూతురు మంజుల ఉన్నారు.

Advertisement

మ‌హేశ్ బాబు ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తుండగా ర‌మేష్ బాబు ఒక‌ప్పుడు హీరోగా సినిమాల్లో న‌టించారు. ఆ త‌ర‌వాత ప‌లు చిత్రాలను నిర్మించారు. కానీ ఆయ‌న చివ‌ర‌కు ఇండ‌స్ట్రీకి దూరం అయ్యారు. మంజుల కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాల‌ని అనుకున్నారు. కానీ మంజుల హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తానంటే కృష్ణ అభిమానులు ఇంటికి వెళ్లి ఆందోళ‌న చేశార‌ట‌. దాంతో మంజుల హీరోయిన్ ఎంట్రీ ఆగిపోయింది. ఇదిలా ఉంటే ఇందిరాదేవి కృష్ణ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కృష్ణ‌కు ఇందిరాదేవి సొంత మ‌ర‌ద‌లు కాగా ఆయ‌న ఆమెను ప్రేమ‌గా చూసుకునేవారు.

కాగా కృష్ణ త‌న‌తో సినిమాల్లో హీరోయిన్ గా న‌టించిన విజ‌య నిర్మ‌ల‌ను పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్న‌ప్ప‌టికీ ఇందిరాదేవి అడ్డుప‌డ‌లేదు. అంతే కాకుండా కుటుంబాన్ని పిల్ల‌ల బాగోగుల‌ను చూసుకున్నారు. ఇదిలా ఉంటే ఇందిరాదేవి ఓ కోరిక తీర‌కుండానే క‌న్నుమూశార‌ని కొన్ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందిరాదేవి చ‌నిపోయేలోపు సితార ఓనీల ఫంక్ష‌న్ చూడాల‌ని అనుకున్నార‌ట‌. ఆ విష‌యాన్ని మ‌హేశ్ కు కూడా చెప్పార‌ట‌. కానీ ఆ కోరిక తీర‌కుండానే ఇందిరాదేవి లోకాన్ని విడిచివెళ్ల‌డం బాధాక‌రం.

Visitors Are Also Reading