Home » “మహానటి” మూవీ సావిత్రి కూతురు ఇంట్లో గొడవలు సృష్టించిందా..?

“మహానటి” మూవీ సావిత్రి కూతురు ఇంట్లో గొడవలు సృష్టించిందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

పుట్టేటప్పుడు ఏం తీసుకురాము, పోయేటప్పుడు కూడా ఏం తీసుకెళ్లలేము.. ఉన్నన్ని రోజులు పదిమందికి సహాయం చేసి బతకాలి అనే నానుడి ఊరికే రాలేదు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహానటి సావిత్రి ఎంతటి గుర్తింపు పొందిందో మనందరికీ తెలుసు. ఆమె ఎదుగుదలతో పాటు ఆమె సంపాదన కూడా ఎదుగుతూ వచ్చింది. అలాంటి సావిత్రి నటలపై దృష్టి పెట్టేది కానీ తన సంపాదన పై దృష్టి పెట్టేది కాదట. తనకు ఎంత డబ్బు ఉంది, ఆ డబ్బును నేను ఎలా కాపాడుకోవాలి అనే విషయాలు అసలు పట్టించుకునేది కాదట. సాయం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ చివరి రోజుల్లో మాత్రం చాలా దారుణమైన పరిస్థితుల్లో కన్నుమూసింది.

Advertisement

అలాంటి సావిత్రి అంత దారుణంగా ఎందుకు అయిందో ఇప్పటికీ అందరి మదిలో ఉన్న ప్రశ్న. అయితే సావిత్రి జీవిత చరిత్ర మీద మహానటి మూవీ వచ్చింది. ఇక అప్పటినుంచి ఆమెపై అనేక వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు బయట పెట్టింది. మహానటి సినిమా తర్వాత మా ఇంట్లో గొడవలు అయ్యాయి అంటూ షాకింగ్ విషయాలు చెప్పింది. మహానటి సినిమా తర్వాత నాన్నపై చాలా విమర్శలు వచ్చాయి..

Advertisement

నాన్న వల్లే ఆమె జీవితం అలా అయిందని అందరూ తిడుతూ కామెంట్స్ పెట్టారు. అది చూసిన అక్క వాళ్ళు అంటే జెమినీ గణేషన్ మొదటి భార్య పిల్లలు ” నీవల్లే నాన్న పేరు చెడిపోయింది అంటూ తిట్టేసారట ” ఇక అప్పటినుంచి నాతో మాట్లాడడం కూడా మానేశారు అంటూ తెలియజేసింది. కానీ ప్రస్తుతం అంతా సర్దుకుని మూడేళ్ల తర్వాత కలిసామని పేర్కొంది. బయోపిక్ లో ఉన్నది ఉన్నట్టు చూపించడం సాధ్యం కాదని, దానికి కాస్త మసాలా జోడిస్తేనే ఆడియన్స్ లో ఆసక్తి పెరుగుతుందని ఇవేవీ పట్టించుకోవద్దని నాన్న మూడో భార్య కూతురు రేఖ నాకు ఫోన్ చేసి చెప్పింది. ఈ విధంగా విజయ చాముండేశ్వరి కామెంట్స్ వైరల్ గా మారాయి.

also read:

Visitors Are Also Reading