Home » భార్య ఉండ‌గానే వాలంటీర్ తో ప్రేమాయ‌ణం…ఆమెను మోసం చేసి మ‌రో యువ‌తితో..చివ‌రికి..!

భార్య ఉండ‌గానే వాలంటీర్ తో ప్రేమాయ‌ణం…ఆమెను మోసం చేసి మ‌రో యువ‌తితో..చివ‌రికి..!

by AJAY
Ad

ప్ర‌జ‌ల‌కు ఆద‌ర్శంగా ఉండాల్సిన పోలీసే దారి త‌ప్పాడు. ఓ యువ‌తిని పెళ్లి చేసుకుని మ‌రో యువ‌తితో ప్రేమాయ‌ణం న‌డిపాడు. అక్క‌డితో ఆగ‌కుండా ఆమెను ప‌క్క‌న పెట్టి మ‌రో యువ‌తిని ట్రాక్ లో పెట్టాడు. దాంతో మోస‌పోయాన‌ని గ్ర‌హించిన యువ‌తి చివ‌రికి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా శ్రీకాకుళం ప‌ట్ట‌ణానికి చెందిన ప్ర‌సాద్ ప‌ట్ట‌ణ పోలీస్ స్టేష‌న్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్ర‌సాద్ కు ఇప్ప‌టికే వివాహం జ‌రిగింది. కాగా ఇటీవ‌ల అత‌డికి ప‌ట్ట‌ణంలోని 9వ వార్డులో వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న రాజేశ్వరి అనే యువ‌తితో ప‌రిచయం ఏర్ప‌డింది. ఇక ఇద్ద‌రి మ‌ధ్యా ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్తా కొద్దిరోజుల‌కు ప్రేమ‌గా మారింది.

Also Read: 35ఏళ్ల ప్రేమ‌..65ఏళ్ల వ‌య‌సులో పెళ్లి…వీళ్ల‌ ల‌వ్ స్టోరీ వేరే లెవ‌ల‌యా..!

Advertisement

Advertisement

lover cheats volunteer

lover cheats volunteer

దాంతో ఇద్ద‌రూ గిఫ్టులు ఇచ్చుకోవ‌డం…షాపింగులు షికార్లు అన్నీ జ‌రిగిపోయాయి. అయితే ప్ర‌సాద్ కు వివాహం జరిగిన విష‌యం రాజేశ్వ‌రికి తెలిసింది. దాంతో ఆమె న‌న్నే మోసం చేస్తావా అంటూ నిల‌దీసింది. కానీ ప్ర‌సాద్ మాత్రం నాకు భార్య అంటే ఇష్టం లేదు. నువ్వే నా స‌ర్వ‌స్వం అంటూ నిన్నే పెళ్లి చేసుకుంటా అంటూ మాయ మాట‌లు చెప్పాడు. ఆ మాటలు న‌మ్మిన రాజేశ్వ‌రి మ‌ళ్లీ ప్ర‌సాద్ తో మున‌ప‌టిలాగా తిరిగింది. ఈ క్ర‌మంలో ప్ర‌సాద్ ఆమెను ప‌క్క‌న పెట్టి మ‌రో యువ‌తిని లైన్ లో పెట్టేశాడు. రాజేశ్వ‌రిని ప‌ట్టించుకోవ‌డం మానేశాడు.

ఆ విష‌యం తెలిసిన రాజేశ్వ‌రి తీవ్ర మ‌న‌స్థాపానికి గురైంది. ప్రియుడి మెసాన్ని త‌ట్టుకోలేక కుమిలిపోయింది. చివ‌ర‌కు ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మ‌హత్య చేసుకుంది. దాంతో ప్ర‌సాద్ త‌న బిడ్డ‌ను ప్రేమ పేరుతో మోసం చేసి పొట్ట‌న పెట్టుకున్నాడంటూ ఆమె త‌ల్లి ఉన్నాతాధికారుల‌కు ఫిర్యాదు చేసింది. అత‌డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘ‌ట‌న పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపున్నారు.

Also Read: అఖండ సినిమా పై వైసీపీ నేత ప్ర‌శంస‌లు…పార్టీలోకి ఆహ్వానిస్తున్న టీడీపీ శ్రేణులు..!

Visitors Are Also Reading