Home » ఎన్టీఆర్ చనిపోవాలని క్షుద్రపూజలు చేశారు – లక్ష్మీపార్వతి

ఎన్టీఆర్ చనిపోవాలని క్షుద్రపూజలు చేశారు – లక్ష్మీపార్వతి

by Bunty
Ad

తన భర్త మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు చనిపోవాలని… ఆయన కూతురు భువనేశ్వరి అప్పట్లో క్షుద్ర పూజలు చేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నందమూరి లక్ష్మీపార్వతి. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తనను అన్యాయంగా అరెస్టు చేశారని నిరసన తెలుపుతూ జైల్లో చంద్రబాబు నాయుడు దీక్ష చేశారు.

laxmi parvathi slams bhuvaneshwari

laxmi parvathi slams bhuvaneshwari

అయితే చంద్రబాబు చేస్తున్న దీక్షలకు నందమూరి లక్ష్మీపార్వతి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏం ఉద్ధరించాడని జైల్లో దీక్షలు చేస్తున్నాడని చంద్రబాబును అలాగే ఆయన కుటుంబాన్ని నిలదీశారు. అప్పట్లో ఎన్టీఆర్ చనిపోవాలని ఆయన కూతురు భువనేశ్వరి క్షుద్ర పూజలు చేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు లక్ష్మీపార్వతి. ఈ విషయం… నందమూరి తారక రామారావుకు తెలియడంతో ఆయన చాలా బాధపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు లక్ష్మీపార్వతి.

Advertisement

ntr laxmi parvathi

Advertisement

అలాగే నారా లోకేష్ ముఖ్యమంత్రి కావాలని భువనేశ్వరి క్షుద్ర పూజలు చేసిందని ఫైర్ అయ్యారు. అవినీతిపరుడి భార్యగా… అలాగే అవినీతిపరుడికి తల్లి గా భువనేశ్వరి పేరు తెచ్చుకున్నారని చురకలు అందించారు. నందమూరి తారకరామారావును ఒంటరి చేసి చంద్రబాబు కుటుంబం ఆయనను చంపేసిందని ఆగ్రహించారు. తనను నందమూరి తారక రామారావు పెళ్లి చేసుకున్నాడని కోపంతో ఇవన్నీ చేశారని నందమూరి లక్ష్మీపార్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading