సినీ పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని లతమంగేష్కర్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం లతమంగేష్కర్ ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారని ఆమెకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని కుటుంబసభ్యులు తెలిపారు.
Latha mangeshkar
అయితే వయసు ఎక్కువగా ఉండటంతో ముందు జాగ్రత్తగా ఆస్పత్రికి చేరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ రోజు రేణూ దేశాయ్ ఆమె కుమారుడు అకీరా నందన్ కూడా కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని రేణూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Advertisement
Advertisement
థర్డ్ వేవ్ ను సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా తాను గతంలో కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్టు తెలిపారు. ఇక వీరితో పాటు ఇండస్ట్రీలో ఇప్పటికే బండ్లగణేష్, మంచు మనోజ్, మంచు లక్ష్మి, సంగీత దర్శకుడు తమన్, సూపర్ స్టార్ మహేష్ బాబు, నటుడు సత్యరాజ్, హీరోయిన్ త్రిష సహా మరికొంతమంది కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం వీరిలో కొంతమంది హోమై ఐశోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు.
Also read : Today Top Ten News : నేటి టాప్ 10 వార్తలు ఇవే…!