Home » Today Top Ten News : నేటి టాప్ 10 వార్తలు ఇవే…!

Today Top Ten News : నేటి టాప్ 10 వార్తలు ఇవే…!

by AJAY
Ad

 

1)ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా అమెరికా వైద్యులు మనిషికి పంది గుండెను అమర్చారు. ఆపరేషన్ సక్సెస్ అవ్వడమే కాకుండా ప్రస్తుతం పేషెంట్ కోరుకున్నారు.

Advertisement

 

2) నటుడు సత్యరాజ్ కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సత్యరాజ్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సత్య రాజ్ శరీరంలో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.

Latest Telugu News

3) కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ప్రైవేటు వ్యాపార సంస్థలు అన్నీ వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి. ఇప్పటికే ఢిల్లీలో థియేటర్లు మాల్స్ మూసివేసిన సంగతి తెలిసిందే.

 

4)దేశంలో గడచిన 24 గంటల్లో 1,68,063 కొత్త కేసులు నమోదయ్యాయి. 29 వేల మంది కరోనా నుండి కోలుకున్నారు. అదేవిధంగా 277 మంది కరోనా తో మరణించారు.

Advertisement

 

5) మేడారం జాతరకు వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసింది. హనుమకొండ నుండి ఉదయం 7 గంటల నుంచి మేడారం కు బస్సులు అందుబాటులో ఉంటాయి.

 

6) తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి కరోనా పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో హోమ్ ఐసోలేషన్ లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు.

 

7) ఏపీలో అధిక ధరల పై నేడు ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది.

 

8) కరోనా కేసులు పెరిగితే 2022 ఐపీఎల్ ను పూర్తిగా ముంబైలోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Latest Telugu News in Telangana

9) యాదాద్రి జిల్లా రాజపేట మండలం బూరుగుపల్లి లో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తమ పెళ్లికి నిరాకరించడంతో సాయి, అఖిల అనే ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.

 

10) బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.

Visitors Are Also Reading