Home » ఖుషి VS న‌ర‌సింహానాయుడు.. ఈ రెండిట్లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టిన సినిమా ఏది?

ఖుషి VS న‌ర‌సింహానాయుడు.. ఈ రెండిట్లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టిన సినిమా ఏది?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

బాలయ్య బాబు నటించిన సినిమాల్లో నరసింహ నాయుడు సినిమా ఎవర్ గ్రీన్. 2001 లో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కాగా.. అదే సంవత్సరంలో ఈ సినిమాకు పోటీగా విడుదల అయిన సినిమా “ఖుషి”. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, భూమిక జంటగా నటించారు.

Advertisement

అప్పటికే, పవన్ కళ్యాణ్ వరుసగా ఆరు హిట్స్ ఇచ్చారు. ఆ తరువాత రిలీజ్ అయిన ఖుషి సినిమా మరో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ ను టర్న్ చేసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అప్పటికే పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆకాశాన్ని అంటింది. 2001 లోనే విడుదల అయిన ఖుషి, నరసింహ నాయుడు సినిమాలు అప్పటి రికార్డ్స్ ని తిరగరాసాయి. అయితే.. ఈ రెండిటిలో ఏది బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది అనేది చాలా మందికి ఉన్న డౌటే.

Advertisement

కలెక్షన్ల విషయంలో చూస్తే న‌ర‌సింహానాయుడు సినిమా 22 కోట్ల షేర్ రాబట్టింది. పవన్ కళ్యాణ్ సినిమా ఖుషి 21 కోట్ల షేర్ ను రాబట్టింది. నెల్లూరు, ఉత్తరాంధ్ర, గుంటూరు,ఈస్ట్ ,వెస్ట్ క‌ర్ణాట‌క వంటి ప్రాంతాల్లో ఖుషి కంటే నరసింహ నాయుడుకే ఎక్కువ కలెక్షన్ వచ్చింది. నరసింహానాయుడు సంక్రాంతికి రిలీజ్ అయితే, మూడు నెలల తర్వాత ఖుషి రిలీజ్ అయ్యింది. అప్పట్లో కలెక్షన్స్ ఎన్ని సెంటర్స్ లో సినిమా ఆడింది అన్నదాన్ని బట్టి ఉండేది. న‌ర‌సింహానాయుడు సినిమా 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడగా, ఖుషి సినిమా 79 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.

మరిన్ని ముఖ్య వార్తలు:

టాలీవుడ్‌ హీరోతో డేటింగ్‌లో సామజవరగమన హీరోయిన్‌ ?

బాయ్‌ ఫ్రెండ్‌ ను పరిచయం చేసిన సమంత..త్వరలోనే రెండో పెళ్లి ?

బాలకృష్ణ రవితేజ మధ్య గొడవేంటి..? బాలయ్య నిజంగానే కొట్టాడా..?

Visitors Are Also Reading