రామ్ హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన బ్యూటీ కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే కీర్తి సురేష్ సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వరుస ఆఫర్లను అందుకుంది. స్టార్ హీరోల సినిమాల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ చిత్రాలలోనూ కీర్తి స్టార్స్ కు జోడీగా నటిస్తోంది. అంతే కాకుండా మహానటి సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.
Advertisement
ఈ సినిమాలో సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి అందర్నీఅవాక్కయ్యేలా చేసింది. ఈ సినిమాలో తన నటనకు కీర్తి ఉత్తమ నటి అవార్డును కూడా అందుకున్నారు. ఆ తరవాత చాలా లేడీ ఓరియెంట్ చిత్రాలలో నటించింది కానీ మహానటి రేంజ్ లో మళ్లీ ఏ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వలేదు. ఇక రీసెంట్ గా మహేశ్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమాలో నటించి మెప్పించింది.
Advertisement
ఈ సినిమాలో గ్లామర్ షో సైతం చేసి యూత్ ను ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా కీర్తి సురేష్ సినిమా ఇండస్ట్రీలో ఎదగటానికి ఆమె పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. కీర్తి సురేష్ తండ్రి సురేష్ నటుడిగా, నిర్మాతగా రాణించారు. ఇక కీర్తి సరేష్ తల్లి మేనక సురేష్ కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఆ తరవాత నటిగా ప్రేక్షకులను అలరించారు.
కాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి తల్లి మేనక సురేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కీర్తి సురేష్ సినిమాలలో మహానటి సినిమా అంటే చాలా ఇష్టమని చెప్పారు. అంతే కాకుండా కీర్తి నటించిన పెంగ్విన్ సినిమా అస్సలు నచ్చలేదని చెప్పారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ బిడ్డకు తల్లిగా నటించిందని…కానీ తన నటన అంతగా నచ్చేలేదని ఓపెన్ గా చెప్పారు.