Home » చిరంజీవిని ప‌రామ‌ర్శించిన సీఎం కేసీఆర్…!

చిరంజీవిని ప‌రామ‌ర్శించిన సీఎం కేసీఆర్…!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్థార‌ణ అయ్యిందని అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ క‌రోనా వ‌చ్చింద‌ని మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. త‌న‌ను క‌లిసిన వారంద‌రూ క‌రోన ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని మెగాస్టార్ తెలిపారు. క‌రోనా పాజిటివ్ రావ‌డంతో తాను హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్న‌ట్టు గా చిరంజీవి వెల్ల‌డించారు. అంతే కాకుండా నిన్న జ‌రిగిన గుడ్ ల‌క్ స‌ఖి ఈవెంట్ కు కూడా క‌రోనా పాజిటివ్ రావ‌డంతో మెగాస్టార్ హాజ‌రుకాలేక‌పోయారు.

Advertisement

kcr chiranjeevi

Advertisement

దాంతో రామ్ చ‌ర‌ణ్ చిరంజీవి స్థానంలో గుడ్ ల‌క్ స‌ఖి ఈవెంట్ కు హాజ‌ర‌య్యారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవిని సీఎం కేసీఆర్ ఫోన్ ద్వారా ప‌రామ‌ర్శించారు. చిరంజీకి ఫోన్ చేసి కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఇదిలా ఉండ‌గా టాలీవుడ్ లో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతూనే ఉంది మెగాస్టార్ తో పాటూ హీరో శ్రీకాంత్ కూడా కరోనా బారిన ప‌డ్డారు. మ‌రికొంద‌రు న‌టీన‌టులు టెక్నీషియ‌న్లు సైతం కరోనా బారిన ప‌డి చికిత్స తీసుకుంటున్నారు.

Visitors Are Also Reading