Home » నాకు వారి నుంచి ప్రాణహాని ఉంది : కరాటే కళ్యాణి

నాకు వారి నుంచి ప్రాణహాని ఉంది : కరాటే కళ్యాణి

by Bunty
Ad

జగద్గీరిగుట్ట పీఎస్‌ లో శివశక్తి ఫౌండేషన్ కేసు నమోదు చేయడం పై సినీ నటి కరాటే కళ్యాణి చేసింది. శివశక్తి ఫౌండేషన్ ఓ ధుష్టశక్తి అని.. అమాయక హిందువుల నుంచి విరాళాల సేకరణ చేసిందని మండిపడ్డారు. వచ్చిన విరాళాలు సొంత అవసరాలకు మళ్ళించారని ఆరోపణలు చేశారు. శివశక్తి ఫౌండేషన్ లో పాత సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి… నిధుల దారి మళ్ళించారని ఆగ్రహించారు.

Advertisement

Advertisement

శివశక్తి ఫౌండేషన్ కార్యాలయం ఏర్పాటుకు రెండున్నర కోట్ల రూపాయల విరాళాలు వసూళ్ళు చేసినట్లు ఆరోపణలు చేశారు. శివశక్తి అధ్యక్షుడు కరుణాకర్ సుగ్గున, డైరెక్టర్లు దేవిరెడ్డి ఆనందకుమార్ రెడ్డి, సునీతారెడ్డి లు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని.. రెండున్నర కోట్ల రూపాయలు వసూలు చేసి…. సొంత అవసరాలకు వాడుకున్నారని మండిపడ్డారు.

శివశక్తి ఫౌండేషన్ లో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించినందుకు… తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారని.. నన్ను ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారు… శివశక్తి ఫౌండేషన్ అధ్యక్షుడు, డైరెక్టర్ల నుంచి నాకు ప్రాణహాని ఉందని సంచలన వ్యాక్యలు చేసింది. శివశక్తి ఫౌండేషన్ అక్రమాలపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.

Visitors Are Also Reading