సినిమా రంగంలో ఒక్కోసారి మెరుపుతీగలా మెరిసిన తారలందరూ ఒక్కోసారి ఉన్నట్లుండి సినిమాలకు దూరం అవుతారు. అలాంటి వారిలో కమలిని ముఖర్జీ కూడా ఉన్నారు.
Advertisement
తన మొదటి సినిమా ఆనంద్ తోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సినిమా మంచి కాఫీ లాంటి సినిమా అని పేరు తెచ్చుకుంది. ఇప్పటికీ ఈ సినిమా టివి లో వస్తూ ఉంటె బోర్ కొట్టకుండా చూస్తూనే ఉంటారు.
అయితే.. ఈ సినిమాతో పరిచయం అయిన కమిలిని ముఖర్జీ మాత్రం ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉన్నారు. 2004 లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ సినిమాతో పరిచయం అయిన కమలిని ముఖర్జీ టాలీవుడ్ ఆడియన్స్ మనసు గెల్చుకుంది.ఆ తరువాత వచ్చిన “గోదావరి” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇక వరుస పెట్టి అవకాశాలు రావడంతో హ్యాపీడేస్, గోపి గోపిక గోదావరి, నాగవల్లి, జల్సా, గమ్యం సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
Advertisement
బాలీవుడ్ కు వెళ్లినా కూడా ఆమెకు ఎక్కువగా తెలుగు లోనే అవకాశాలు వచ్చాయి. ఇక మలయాళం, తమిళ, బెంగాళీ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. తెలుగులో చివరిగా గోవిందుడు అందరివాడేలే సినిమాలో కనిపించిన కమలిని ఆ తరువాత సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం బిజినెస్ వైపు దృష్టి సారించి అమెరికాలో స్థిరపడ్డారు. ఇటీవల డల్లాస్ లోని ఓ ఈవెంట్ లో కమలిని సందడి చేసారు. ఈ ఈవెంట్ తాలూకు ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
మరిన్ని ముఖ్య వార్తలు:
టాలీవుడ్ హీరోతో డేటింగ్లో సామజవరగమన హీరోయిన్ ?
బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన సమంత..త్వరలోనే రెండో పెళ్లి ?
బాలకృష్ణ రవితేజ మధ్య గొడవేంటి..? బాలయ్య నిజంగానే కొట్టాడా..?