Home » మహానది మూవీలో కమలహాసన్ కూతురుగా చేసిన అమ్మాయి ఎవరో తెలుసా..!!

మహానది మూవీలో కమలహాసన్ కూతురుగా చేసిన అమ్మాయి ఎవరో తెలుసా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సినిమా ఇండస్ట్రీలోకీ రావడానికి ఛాన్సుల కోసం అనేకమంది నటీనటులు వెయిట్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఎన్ని ఛాన్సులు ఇచ్చినా కూడా కలిసి రాదు.. మరికొంతమంది సినిమాలో ఛాన్సులు వచ్చినా నటించడానికి ఆసక్తి చూపరు. అలాంటి కోవకే చెందుతుంది మహానది మూవీలో కమలహాసన్ కూతురుగా చేసిన శోభన.. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..సినిమా ఇండస్ట్రీలోకి చాలామంది ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ నిలదొక్కుకోవడానికి అనేక కష్టాలు పడతారు. మరికొంతమంది వారికి సినిమాలు అంటే నచ్చకనో మరి ఇంకేదైనా కారణం వల్లనో ఇండస్ట్రీలో మంచి విజయం సాధించినా కానీ ఒక్క సినిమాతోనే దూరమైపోతూ ఉంటారు. అలాంటి వారిలో ముందుగా గుర్తుకువచ్చేది గీతాంజలి గిరిజ.

Advertisement

also read:నాగార్జునకు షాక్ …లీగల్ నోటీసులు పంపించిన సర్పంచ్…!

Advertisement

ఈమె ఒక్క మూవీ చేసిన తర్వాత అమీర్ ఖాన్ ఆఫర్ ఇచ్చినా కానీ ఒప్పుకోకుండా ఇండస్ట్రీ ని వదిలి వెళ్ళిపోయింది. అంతేకాకుండా సప్తపది మూవీ సబిత. ఈమె కూడా ఒక్క సినిమా తర్వాత మరే సినిమా లో కనిపించలేదు. అంతేకాదు షారుక్ ఖాన్ సరసన స్వదేష్ మూవీలో నటించిన హీరోయిన్ గాయత్రి జోషి.ఈమె కూడా ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయింది. ఇకపోతే మనందరికీ తెలిసిన బాలు చెల్లెలు ఎస్పీ శైలజ, ఈవిడ కూడా ఒకే ఒక్క సినిమాతో నటన వద్దు బాబోయ్ అంటూ వెళ్లిపోయి పాటల వైపు మొగ్గు చూపింది. ఈ లిస్టులో మహానది మూవీలో కమలహాసన్ కూతురుగా నటించిన శోభన కూడా చేరింది. శోభన అంటే హీరోయిన్ శోభన అనుకునేరు .. కాదు కాదు తమిళనాడులో మరో శోభన ఉంది.

ఆవిడే మహానది శోభన. ఈ చిత్రంలో కమలహాసన్ కూతురుగా చేసింది శోభన. ఆ తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి వెళ్లిపోయింది. మరి శోభన ఎవరు? ఆ విశేషాలు చూద్దాం. శోభన కూడా సింగరే.. అందుకే మహానది సినిమాలో శ్రీరంగ రంగనాథుడి దివ్య రూపం చూడరే అనే పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తో కలిసి పాడింది. ఈ మహానది మూవీ ఆమెకు మొదటి మూవీ మరియు ఆఖరి మూవీ. ఈమె సినిమాల్లో నటించకపోవడానికి కారణాలు తెలియదు కానీ ,ఒకే ఒక్క సినిమా తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ సినిమా తమిళ్ లో పుష్పంగల్ అనే పేరుతో విడుదలై సంచలన విజయమందుకుంది.

also read:

Visitors Are Also Reading