Home » షర్మిలపై కేఏ పాల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు..YSR ఆత్మతో మాట్లాడాను !

షర్మిలపై కేఏ పాల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు..YSR ఆత్మతో మాట్లాడాను !

by Bunty

 

వైఎస్‌ షర్మిల కాంగ్రెస్ చేరడంపై వివాదాస్పద వ్యాఖ్యలు కేఏ పాల్‌ చేశారు. నిన్న వైఎస్‌ షర్మిల…. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేతలు అయిన రాహుల్‌ గాంధీ, మల్లి ఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు వైఎస్‌ షర్మిల. అంతేకాకుండా… రెండు సంవత్సరాల కిందట పెట్టిన తెలంగాణ వైసీపీ పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేశారు.

KA Paul's controversial comments on Sharmila

KA Paul’s controversial comments on Sharmila

అయితే.. వైఎస్‌ షర్మిల కాంగ్రెస్ చేరడంపై వివాదాస్పద వ్యాఖ్యలు కేఏ పాల్‌ చేశారు. వైఎస్‌ షర్మిల విషయంపై రాజశేఖర్ రెడ్డి ఆత్మతో మాట్లాడేందుకు నేను ప్రయత్నించానని కెఎ పాల్ వెల్లడించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై స్పందించిన కెఎ పాల్…. రాజశేఖర్ రెడ్డి గారు నాకు పరిచయం గనక వారి ఆత్మతో కమ్యూనికేట్ చేయటానికి ప్రయత్నించానని తెలిపారు.

రాజరెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికుంటే షర్మిలని ఏ విధంగా అడ్డుకునే వారో నాకు అర్థమైందని ఫైర్‌ అయ్యారు. రాజకీయాలు అంటేనే అతి దరిద్రం,అసలు ఇంత దరిద్రమైన రాజకీయాలు 200 దేశాల్లో ఎక్కడ చూడలేదు అని కెఎ పాల్ అన్నారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో పుట్టి.. ఆయనకు అన్యాయం చేసిన కాంగ్రెస్‌ పార్టీలో షర్మిల ఎలా చేరతారని కేఏ పాల్‌ ఫైర్‌ అయ్యారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading