Home » జపాన్ భూకంపం నుంచి తప్పించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ?

జపాన్ భూకంపం నుంచి తప్పించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ?

by Bunty
Ad

నిన్న కొత్త సంవత్సరం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలు చాలా గ్రాండ్గా చేసుకున్నారు జనాలు. అయితే జపాన్ దేశస్థులకు మాత్రం కొత్త సంవత్సరం విషాదాన్ని నింపింది. కొత్త సంవత్సరం మొదటి రోజున వరుసగా భూకంపాలు చోటుచేసుకున్నాయి.దీంతో జపాన్ దేశం అతలాకుతలమైంది. జనాలు వణికిపోయారు. జపాన్ పశ్చిమ తీరంలోని ఇషికావా ప్రీ పిక్చర్ సమీప ప్రాంతంలో నిన్న సాయంత్రం నాలుగు గంటల సమయంలో రిక్టార్ స్కేలు పై నాలుగు కంటే ఎక్కువ తీవ్రతతో ఏకంగా 150 సార్లు భూమి కనిపించినట్లు జపాన్ వాతావరణ శాఖ అధికారిక ప్రకటన చేసింది.

 

Jr. NTR returns from Japan safely

ఇలా 150 కి పైగా భూమి కనిపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక మంగళవారం తెల్లవారుజామున ఆరుసార్లు భూమి కనిపించింది. ఇలా జపాన్లో భూకంపం రావడంతో వేలాది ఇండ్లు అలాగే భవనాలు కుప్పకూలాయి. మరికొన్ని పాక్షికంగా ఇండ్లు దెబ్బతిన్నాయి. ఇక ఈ భూకంపం కారణంగా 40 మంది వరకు మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

Advertisement

Jr-Ntr

అయితే జపాన్ భూకంపం నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఈ భూకంపంపై రాజాగా జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ పెట్టారు. జపాన్ నుంచి ఇవాళ ఇంటికి తిరిగి వచ్చానని… గత వారం అంతా అక్కడే గడిపినట్లు ఎన్టీఆర్ తెలిపారు. జపాన్ లో భూకంపం వార్త విని షాక్ అయ్యానని… మృతులకు నివాళులు అర్పించారు. జపాన్ ప్రజలు త్వరగా కోలుకోవాలని కూడా ట్వీట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంకో రెండు మూడు రోజులు ఎన్టీఆర్ అక్కడే ఉంటే పెను ప్రమాదం జరిగేదని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading