Home » జెట్టి సినిమా ట్రైల‌ర్ ను లాంచ్ చేసిన గోపిచంద్ మ‌లినేని…!

జెట్టి సినిమా ట్రైల‌ర్ ను లాంచ్ చేసిన గోపిచంద్ మ‌లినేని…!

by AJAY
Ad

మాన్యం కృష్ణ, నందిత శ్వేత హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా జెట్టి. ఈ సినిమాకు సుబ్రహ్మణ్యం పిచ్చుక దశకత్వం వహించారు. వేణుమాధవ్ వ‌ర్ద‌ని ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి కార్తీక్ కొడకండ్ల స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదల కాగా యూట్యూబ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అదేవిధంగా ఈ సినిమా నుండి పాటలు విడుద‌ల‌ చేయగా మిలియన్స్ వ్యూవ్స్ తో దూసుకుపోతున్నాయి.

Advertisement

ఇక‌ ఈ చిత్రాన్ని నవంబర్ 4వ తేదీన విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సినిమా ట్రైలర్ లోని కొన్ని విజువల్స్ తనను ఆశ్చర్యపరిచాయని అన్నారు. చాలా రియలిస్టిక్ అప్రోచ్ తో మత్స్యకారుల జీవితాలను తెరమీదకి తెచ్చిన విధానం చాలా బాగుందని అన్నారు.

Advertisement

ఈ సినిమా కథలో మట్టి వాసనలు తెలుస్తున్నాయని గోపీచంద్ మలినేని ప్రశంసలు కురిపించారు. దర్శకుడి ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సినిమా పాటలు కూడా మంచి విజయం సాధించాయని తెలిసిందని ఈ సినిమాతో పరిచయం అవుతున్న హీరో కృష్ణకు దర్శకుడు సుబ్రహ్మణ్యం పిచ్చుకకు గోపీచంద్ మ‌లినేని అభినందనలు తెలిపారు.

అనంతరం ఈ సినిమా దర్శకుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. తీర ప్రాంతంలో ఒక జీవన విధానం ఉంటుంది. వారి సమస్యలు కట్టుబాట్లు చాలా పట్టిష్టంగా ఉంటాయని అన్నారు. అలాంటి నేపథ్యంలో జెట్టి సినిమాను తీశామని చెప్పారు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ అందిస్తుందని భీమా వ్యక్తం చేశారు. తప్పకుండా సినిమాకు ప్రేక్షకుల ఆద‌ర‌ణ‌ లభిస్తుందని అన్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేసిన దర్శకుడు గోపి చందమాలినేనికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక నవంబర్ 4న విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Visitors Are Also Reading