Home » మూడో పెళ్లి పై స్పందించిన జయసుధ…ఆ వ్యక్తి ఎవరో కాదంటూ ఓపెన్ కామెంట్స్…!

మూడో పెళ్లి పై స్పందించిన జయసుధ…ఆ వ్యక్తి ఎవరో కాదంటూ ఓపెన్ కామెంట్స్…!

by AJAY
Ad

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన జయసుధ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. తల్లిగా మరియు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ఇక జయసుధ సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత విభేదాల వల్ల ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత జయసుధ నిర్మాత నితిన్ కపూర్ ను రెండవ వివాహం చేసుకున్నారు. నితిన్ కపూర్ సినిమా నిర్మాణ రంగంలో వచ్చిన నష్టాలు మరియు ఇతర కారణాల వల్ల బలవన్మరణానికి పాల్పడ్డారు.

Advertisement

ఆ తర్వాత జయసుధ ఒంటరిగానే ఉన్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా జయసుధ మూడో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. దానికి కారణం జయసుధ వెంట ఎప్పుడు చూసినా ఓ వ్యక్తి కనిపించడమే. రీసెంట్ గా వారసుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆ వ్యక్తి జయసుధ పక్కనే కనిపించారు.

Advertisement

దాంతో ఆమె మూడో పెళ్లి వార్తలకు బలం చేకూరింది. అయితే ఆ వార్తలపై జయసుధ తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అతను అమెరికాకు చెందిన వ్యక్తి అని జయసుధ వెల్లడించారు. తన బయోపిక్ ను తీసేందుకు ఆయన ఇండియాకు వచ్చారని జయసుధ స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో తన ప్రాముఖ్యత గురించి తెలుసుకునేందుకే తన వెంట వస్తున్నారని చెప్పారు.

అతని పేరు ఫెలిపే రూయెల్స్ అని తన బయోపిక్ తీస్తున్నారని చెప్పారు. తన గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఇంటర్నెట్ లో తెలుసుకున్నారని… కానీ ఇక్కడ తనకు ఫాలోయింగ్ ఉందా? తన సినిమాల షూటింగ్ ఇతర వివరాలు తెలుసుకునేందుకు తనను ఫాలో అవుతున్నారని అన్నారు. అంతే తప్ప ఇంకేమీ లేదని చెప్పారు.

Visitors Are Also Reading