బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. శ్రీదేవి వారసురాలిగా జాన్వి కపూర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తన తల్లి శ్రీదేవి స్టార్ డమ్ ను ఉపయోగించుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ తాను అనుకున్న మేర విజయాన్ని సొంతం చేసుకోలేక డీల పడిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో కలిసి నటిస్తోంది.
అటు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ గానే ఉంటుంది జాన్వి. ఈ క్రమంలోనే తాజాగా జాన్వి కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ గా మారింది. శ్రీదేవి కూడా నిత్యం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉండేది. తన తల్లి నుంచి వచ్చిన అలవాటు ప్రకారం జాన్వి కూడా ఎప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటుంది. తాజాగా జాన్వి తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం బయటికి వస్తున్నప్పుడు తన ప్రియుడితో కలిసి కెమెరా కంటపడింది ఈ అమ్మడు.
Advertisement
జాన్వి, శిఖర్ ఇద్దరూ సాంప్రదాయకరమైన దుస్తులను ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన బాయ్ ప్రేండ్ శిఖర్ పహారియా,పిన్ని మహేశ్వరితో కలసి శ్రీవారిని దర్శించుకుంది జాన్వీ కపూర్. ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా…. వీరిద్దరి జంట చాలా అందంగా ఉందని కామెంట్లు వస్తున్నాయి. వీరిద్దరూ చాలాకాలం నుంచి ప్రేమలో ఉన్నారని, డేటింగ్ కూడా చేస్తున్నారని ఎన్నో రకాల వార్తలు వస్తున్నప్పటికీ వీటిపై జాన్వికపుర్ ఇంతవరకు స్పందించలేదు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!