దర్శక, నటుడు జిమారిముత్తు (57) తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయారు. వివరాలు చూస్తే.. ఆయన గుండెపోటుతో చనిపోయినట్టు తెలుస్తోంది. కోలీవుడ్ ప్రముఖులంతా సంతాపాన్ని తెలిపారు. ఈయన చివరగా రజినీ కాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమాలో కనపడ్డారు. బుల్లితెర, వెండితెరపై కూడా అలరిస్తూ ఉండేవారు. బుల్లితెరపై ఎన్నో సీరియల్స్లో కనపడ్డారు కూడా. అలానే వెండితెరపై ఎన్నో విభిన్న పాత్రలను చేసి తన నటన తో అందరినీ ఆకట్టుకున్నారు.
Advertisement
Advertisement
అలానే మంచి గుర్తింపుని కూడా ఈయన తెచ్చుకున్నారు. దర్శకుడిగా కూడా ట్రై చేసారు. కానీ సక్సెస్ కాలేకపోయారు. అందుకనే కారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయిపోయారు. సైడ్ కారెక్టర్స్ తో పాటుగా విలన్ పాత్రలని కూడా చేస్తూ ఈయన మెప్పించారు. జైలర్ సినిమాలో కొంచెం ప్రాధాన్యత ఉన్న పాత్ర చేసే ఛాన్స్ ఏ వచ్చింది. విలన్ వర్మ పక్కన కనపడి ఆకట్టుకున్నారు.
Also read:
- పవన్ కళ్యాణ్ OG స్టోరీ లీక్.. కథ ఏమిటంటే..?
- ఎన్టీఆర్ చేసిన త్యాగం వల్లే.. కళ్యాణ్ రామ్ కష్టాలు తొలగిపోయాయా..?
- నాగార్జున నా సామిరంగ లో హీరోయిన్స్ ఫిక్స్… ఎవరంటే..?