Home » Jeevitha Rajashekar: షాకింగ్.. జీవిత, రాజశేఖర్‌లకు ఏడాది జైలు

Jeevitha Rajashekar: షాకింగ్.. జీవిత, రాజశేఖర్‌లకు ఏడాది జైలు

by Bunty
Ad

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో జీవిత, రాజశేఖర్ దంపతుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నిత్యం ఏదో ఒక వివాదంలో తల దూర్చి వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ జంట. ఇప్పటికే అనేక వివాదాలలో చిక్కుకున్న ఈ జంట మరోసారి… వార్తల్లో నిలిచింది. తాజాగా జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించింది.

Advertisement

పరువు నష్టం కేసులో జీవిత మరియు రాజశేఖర్ దంపతులకు ఏడాది పాటు జైలు శిక్ష విధించిన కోర్టు ఆ వెంటనే బెయిల్ కూడా మంజూరు చేసింది. పరువు నష్టం కేసులో జీవిత మరియు రాజశేఖర్ దంపతులకు నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించడమే కాకుండా ఏకంగా 10,000 రూపాయలను జరిమానగా విధించింది. 2011 సంవత్సరంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకు పై నిరాధారమైన ఆరోపణలు చేసింది జీవిత మరియు రాజశేఖర్ జంట.

Advertisement

బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తాన్ని అమ్ముకుంటున్నారని… ఆ సంవత్సరం నుంచి వచ్చిన డబ్బులను వాడుకుంటున్నారని గతంలో జీవిత మరియు రాజశేఖర్ ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేశారు. అయితే దీనిపై అల్లు అరవింద్ గారు… జీవిత మరియు రాజశేఖర్ కు వ్యతిరేకంగా కోర్టు లో పరువు నష్టం దావా వేశారు. అయితే తాజాగా ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు… జీవిత మరియు రాజశేఖర్ కు ఏడాది పాటు జైలు శిక్ష తోపాటు పదివేల రూపాయల జరిమానా కూడా విధించింది. అలాగే ఈ దంపతులకు బెయిల్ కూడా మంజూరు చేసింది న్యాయస్థానం.

Visitors Are Also Reading