Home » ఐపీఎల్ వైఫల్యం పై జడేజా షాకింగ్ కామెంట్స్…!

ఐపీఎల్ వైఫల్యం పై జడేజా షాకింగ్ కామెంట్స్…!

by Azhar
Ad
ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5వ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చెలరేగిన విషయం తెలిసిందే. కానీ ఈ పర్యటనకు ముందు జరిగిన ఐపీఎల్ 2022 సీజన్ లో మాత్రం జడేజా దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నింట్లో జడేజా వైఫల్యం అనేది అందరికి కనిపించింది. అయితే ఈ ఇప్స్ల ప్రారంభానికి ముందు జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ జర్రుకు కెప్టెన్ గా నియమించింది యాజమాన్యం. కానీ జడేజా కెప్టెన్సీలో జట్టు అనుకున్న విధంగా రాణించలేదు.
మొదటి మ్యాచ్ లోనే ఓడిపోయిన చెన్నై వరుసగా నాలుగు ఓటములు చూసింది. ఇక కెప్టెన్సీ ఒత్తిడికూడా జడేజాలో స్పష్టంగా కనిపించడంతో కెప్టెన్ గా అతడిని తప్పించింది చెన్నై యాజమాన్యం. మళ్ళీ ధోనీకే ఆ బాధ్యతలు ఇచ్చింది. కానీ కెప్టెన్ గా తనను తప్పించడం జడేజాకు ఇష్టం లేదు అని వార్తలు వచ్చాయి. ఇక ఆ తర్వాత చెన్నై యాజమాన్యానికి.. జడేజాకు దూరం పెరిగింది అని చాలా మంది అన్నారు. ఇక సీజన్ చివర్లో జడేజా గాయం కారణంగా జట్టు నుండి తప్పుకున్నాడు. అందువల్ల వచ్చే సీజన్ జడేజా చెన్నైకి ఆడాడు అని ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలు చెన్నై జట్టు కొట్టేసింది.
ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ నిన్న సెంచరీ చేసిన జడేజా… మ్యాచ్ ముగిసిన తర్వాత విలేకర్లతో మాట్లాడాడు. అప్పుడు ఐపీఎల్ వైఫల్యం గురించి ప్రశ్నించగా.. నేను  ఇప్పుడు దాని గురించి ఆలోచించడం లేదు. జరిగింది ఏదో జరిగిపోయింది. అయిన కూడా మీరు మీ దేశానికి ఆడుతున్నప్పుడు ఇలాంటి విషయాలను అన్ని పక్కన పెట్టాలి. అయితే ఇప్పుడు దేశం కోసం ఇలా ఆడటం చాలా సంతోషంగా ఉంది అని జడేజా పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో టీం ఇండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు జడేజా, పంత్ కలిసి టీం ఇండియాను టాప్ లో అణచినా విషయం తెలిసిందే.

Advertisement

Visitors Are Also Reading