Home » షర్మిలకు కాబోయే కోడలు చంద్రబాబు నాయుడుకు బంధువా?

షర్మిలకు కాబోయే కోడలు చంద్రబాబు నాయుడుకు బంధువా?

by Srilakshmi Bharathi
Ad

షర్మిల కుమారుడు వై ఎస్ రాజారెడ్డి వివాహం గురించి ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అట్లూరి ప్రియా అనే అమ్మాయితో రాజారెడ్డి వివాహం జరగబోతోందని చాలా కాలం నుంచే వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. దీనితో నెటిజన్స్ అందరు అట్లూరి ప్రియా గురించి నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. ఆమె ఎవరు? ఆమె నేపధ్యం ఏమిటి అన్న విషయాలను ఆరా తెస్తున్నారు. ఈ క్రమంలోనే సంచలన విషయాలు తెలుస్తున్నాయి.

Advertisement

అట్లూరి ప్రియా గురించి కూడా చాలా వార్తలే వైరల్ అయ్యాయి. మొదట్లో ఆమె చట్నీస్ హోటల్స్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆమె చట్నీస్ హోటల్స్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలు కాదు అని తెలిసి వచ్చింది. ఈ క్రమంలో ఆమె గురించిన మరిన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్రదర్ అనిల్ కు అత్యంత సన్నిహితుడైన అట్లూరి శ్రీనివాస్ – మాధవి దంపతుల కూతురే ప్రియా అని తెలుస్తోంది. అట్లూరి వారు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు.

Advertisement

షర్మిల అన్న జగన్ తన శత్రువుగా భావించే సామాజిక వర్గం నుంచి.. షర్మిల కోడలిని తెచ్చుకోవడం నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కొందరు అట్లూరి ప్రియా చంద్రబాబు నాయుడుకు బంధువు అవుతారు అంటూ కామెంట్స్ చేస్తుంటే.. మరి కొందరేమో.. జగన్ ను కాదనుకుని వెళ్ళిపోయినప్పుడే షర్మిలతో బంధం తెగిపోయిందని.. ఆమె గురించి ఇంత చర్చ అనవసరం అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. అట్లూరి ప్రియకు చంద్రబాబు నాయుడుకు ఎటువంటి బంధుత్వం లేదనీ.. ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్నా ప్రచారం మాత్రమేనని తెలుస్తోంది.

 తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading