విజయ్ దేవరకొండ దర్శకుడు తరుణ్ భాస్కర్ కాంబినేషన్ లో వచ్చిన పెళ్లి చూపులు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ భాష చిత్రం క్యాటగిరీలో నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా రీతూవర్మ నటించింది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీనే ఈ సినిమా కథ.
అంతే కాకుండా పక్కా తెలంగాణ యాసలో ఈ సినిమా ప్రేక్షకుల ముందకు వచ్చి మనసు దోచుకుంది. ఈ సినిమా ప్రియదర్శి చేసే కామెడి కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇలాంటి బ్యూటిఫుల్ అవార్డ్ విన్నింగ్ సినిమాను ఓ ఇద్దరు టాలీవుడ్ హీరోలు మిస్ చేసుకున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు తరుణ్ భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమా కథను తనకు నిజజీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా రాసుకున్నట్టు తెలిపాడు.
మొదట తరుణ్ భాస్కర్ తీసిన సైన్మా షార్ట్ ఫిల్మ్ చూసిన మంచు లక్ష్మి తనతో సినిమా చేయాలని తరుణ్ భాస్కర్ ను కోరారట. అప్పుడు హైదరాబాద్ ను బేస్ చేసుకుని ఒక ప్రేమకథ రాసానని తరుణ్ భాస్కర్ వివరించగా వెంటనే మంచు లక్ష్మి చెక్ ఇచ్చారట. కానీ కొన్ని కారణాల వల్ల మంచు లక్ష్మితో సినిమా చేయడం కుదరలేదట. ఆ తరవాత రాజ్ కందుకూరి తో కలిసి పెళ్లి చూపులు సినిమా చేశానని తరుణ్ భాస్కర్ తెలిపారు.
ఇక ఈ సినిమాకు మొదట విజయ్ దేవరకొండను అనుకోలేదని పెళ్లి చూపులు కథను అఖిల్ కు వినిపించగా ఆయన రిజెక్ట్ చేశారని చెప్పారు. అంతే కాకుండా మెగా హీరో వరుణ్ తేజ్ కు కూడా చెప్పగా ఆయన కూడా రిజెక్ట్ చేశాడని తెలిపాడు. దాంతో థియేటర్ యాక్టర్ గా అవకాశాల కోస ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండకు చెప్పానని అతడు ఓకే చెప్పడంతో సినిమా పట్టాలెక్కిందని తెలిపాడు.ఇక ఈ సినిమా తరవాత విజయ్ దేవరకొండతో పాటూ నటీనటులు, దర్శకుడు తరుణ్ భాస్కర్ కు మంచి పేరు వచ్చింది.