Home » ముఖానికి ర‌క్తం కారుతుంటే ఎండుమ‌ర్చి న‌మిలిన ఎన్టీఆర్…ఎందుకో తెలుసా…!

ముఖానికి ర‌క్తం కారుతుంటే ఎండుమ‌ర్చి న‌మిలిన ఎన్టీఆర్…ఎందుకో తెలుసా…!

by AJAY
Ad

చిత్ర పరిశ్రమ గ‌ర్వించదగ్గ నటుల్లో ఎన్టీ రామారావు ముందు వరుసలో ఉంటారు. కేవలం సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ ఎన్టీఆర్ హీరోగా కొనియాడబడ్డారు. సినిమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం తో పాటు రాజకీయాల్లోకి వ‌చ్చి ఎన్టీఆర్ ప్రజా సేవ చేశారు. ముఖ్యమంత్రిగా తెలుగు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఎన్నో ప‌థ‌కాల ద్వారా పేద ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌రయ్యారు. ఎన్టీఆర్ సినిమాలో ప్రేక్షకులను మెప్పించడానికి ఎంతటి సాహసమైనా చేసేవారు.

Advertisement

అంతే కాకుండా ఎన్టీఆర్ చేసే కొన్ని ప‌నులు అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచేవి. అలా ఎన్టీఆర్ చేసిన ఒకప‌ని అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆ పనేంటో ఇప్పుడు చూద్దాం….1977 సంవత్సరంలో ఎన్టీఆర్ ఎదురీత అనే సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన సన్నివేశం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రానికి వి.మ‌ధుసూద‌న‌రావు దర్శకత్వం వహించగా వాణిశ్రీ ఎన్టీఆర్ కు జోడీగా నటించింది.

Advertisement

కైకాల సత్యనారాయణ సినిమాలో విలన్ గా నటించారు. ఇక ఈ చిత్రం ఎక్కువ భాగం తూర్పుగోదావరి జిల్లాలోని లంక గ్రామాల్లో షూటింగ్ జరిగింది. షూటింగ్ లో భాగంగా యానంలో సముద్రంపై ఎన్టీఆర్ కైకాల సత్యనారాయణ పై ఓ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ పోరాట స‌న్నివేశంలో షిప్స్ ట్రాల‌ర్స్ పై ఓ వైపు సైడ్ ఆర్టిస్ట్ వెళ్తుండగా మరోవైపు కెమెరా టీం వెళుతూ షూటింగ్ చేస్తున్నారు.

ALSO READ : SARKARU VARI PATA : స‌ర్కారు వారి పాట అప్డేట్…మ‌హేశ్ లుక్ మామూలుగా లేదుగా…!

అయితే అదే సమయంలో అనుకోకుండా ఎన్టీఆర్ ముఖానికి ఓ ఇనుప‌రాడ్ గట్టిగా తగిలింది. దాంతో రక్తం ఎక్కువగా కారింది… అది చూసిన టీం ఎంతో ఆందోళన చెందారు. షూటింగ్ కు బ్రేక్ చెప్పి ఎన్టీఆర్ ను తీసుకుని ఒడ్డుకు చేరుకున్నారు. అయితే ఆ సమయంలో ఒడ్డుపై ఎవరో మిరపకాయలను ఆరబోశారు. వాటిలో కొన్ని మిరపకాయలు తీసుకుని ఎన్టీఆర్ నోట్లో వేసుకుని న‌మిలారు. కాసేపయ్యాక ప‌దండి షూటింగ్ మొద‌లెడ‌దామ‌ని అన్నారు. దాంతో ఎన్టీఆర్ చేసిన ప‌నికి అందరూ ఆశ్చ‌ర్య‌పోయారు.

Visitors Are Also Reading