Home » ఇండియా పని గోవిందా.. కివీస్ తోనే సెమీస్..?

ఇండియా పని గోవిందా.. కివీస్ తోనే సెమీస్..?

by Azhar
Ad
ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో మన ఇండియా జట్టు కూడా టైటిల్ ఫెవరెట్ గా ఉంది. కానీ తాజా లెక్కల ప్రకారం చూస్తే మన జట్టు సెమీస్ నుండి ఇంటికి వచ్చేలా కనిపిస్తుంది. అందుకు కారణం.. సెమీస్ లో మన జట్టుకు న్యూజిలాండ్ తో పోటీ పడనుంది అనిపిస్తుంది.
అయితే ఈ టోర్నీ ప్రారంభమైన తర్వాత న్యుజిలాండ్, ఇండియా తన తా గ్రూప్ లలో టాప్ పొజిషన్ లో ఉన్నాయి. కానీ సౌత్ ఆఫ్రికాతో ఇండియా ఓడిపోయిన తర్వాత మనం రెండో స్థానంలోకి వచ్చాము. కానీ ఈరోజు ఇంగ్లాండ్ తో న్యూజిలాండ్ ఓడిపోయిన ఇంకా టాప్ పొజిషన్ లోనే ఉంది. అయితే ఈ జట్టు ఇలానే టాప్ పొజిషన్ లోనే సెమీస్ కు వెళ్తుంది అని ఆ గ్రూప్ ను చుస్తే అర్ధం అవుతుంది.
ఇక మన ఇండియా తర్వాత జరిగే రెండు మ్యాచ్ లలో గెలిచినా.. సౌత్ ఆఫ్రికా కూడా రెండు మ్యాచ్ లలో గెలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అందువల్ల మనం రెండో స్థానంలో సెమీస్ కు వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి.. మనకు న్యూజిలాండ్ తోనే సెమీస్ ఉంటుంది. అయితే న్యూజిలాండ్ జట్టుతో ఐసీసీ టోర్నీలలో ఇండియా పరిస్థితి ఏంటి అనేది గత ప్రపంచ కప్ టోర్నీలు చూస్తే అర్ధం అవుతుంది.

Advertisement

Visitors Are Also Reading