Home » ఏఎన్ఆర్ చివరి రోజుల్లో అందర్నీ దూరం పెట్టడానికి కారణం..?

ఏఎన్ఆర్ చివరి రోజుల్లో అందర్నీ దూరం పెట్టడానికి కారణం..?

by Sravanthi Pandrala Pandrala
Ad

అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏర్పరచుకున్నారు. అంతేకాకుండా అక్కినేని ఫ్యామిలీకి అంతటి గౌరవం లభించింది అంటే ప్రధాన కారణం నాగేశ్వరరావు అని చెప్పుకోవచ్చు. అలాంటి నాగేశ్వరరావు తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ హీరో అని కూడా చాలామంది చెప్పుకుంటారు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుండి ఇప్పటికే ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

Advertisement

కానీ ఇందులో కేవలం నాగార్జున మాత్రమే స్టార్ హీరోగా తండ్రి తగ్గ తనయుడు గా పేరు తెచ్చుకున్నారు. ఇక మిగిలిన వాళ్ళందరూ స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అక్కినేని నాగేశ్వరరావు అందరితో చాలా సన్నిహితంగా ఉండేవారు కానీ చివరి రోజుల్లో మాత్రం అందరిని దూరం పెట్టారట. దీనికి గల ప్రధాన కారణం ఏంటో క్యారెక్టర్ ఆర్టిస్టు కాదాంబరి కిరణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు .. కాదాంబరి కిరణ్ మాట్లాడుతూ.. ఏఎన్ఆర్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. నా జీవితాన్ని నిలబెట్టిన మంచి వ్యక్తుల్లో ఏఎన్ఆర్ గారు కూడా ఒకరు. అలాంటి ఏఎన్నార్ గారిని చివరి రోజుల్లో దగ్గరుండి చూసిన ఏకైక వ్యక్తిని నేనే.

Advertisement

అయితే చివరి రోజుల్లో ఏఎన్ఆర్ గారు తన దగ్గరికి ఎవర్ని రానివ్వలేదు. అంతేకాకుండా ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది నటినటులు ఆయన్ని చూడడానికి వస్తే కనీసం లోపలికి కూడా రానివ్వలేదు. అయితే ఆయన క్యాన్సర్ వ్యాధి బారిన పడి చనిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే చివరి రోజుల్లో ట్రీట్మెంట్ తీసుకున్న టైంలో ఆయన చర్మం ముట్టుకుంటేనే ఊడిపోయేది. అలాగే ఎవరైనా తన దగ్గరికి వచ్చి తన పరిస్థితిని చూసి ఏడుస్తుంటే తన ధైర్యం కోల్పోతాడు అనే ఉద్దేశంతో చివరి రోజుల్లో తన దగ్గరికి ఎవరిని రానివ్వలేదు అంటూ కాదాంబరి కిరణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

also read:లైవ్ మ్యాచ్ లో మైదానంలోకి దూసుకొచ్చి రోహిత్ ని హత్తుకున్న బాలుడు.. ఇందుకు హిట్ మ్యాన్ ఏం చేసాడో తెలుసా..?

Visitors Are Also Reading