Home » మీరు లవ్ చేసిన వారితో పెళ్లి జరగాలంటే.. ఈ ఆలయాన్ని దర్శించాల్సిందే..!!

మీరు లవ్ చేసిన వారితో పెళ్లి జరగాలంటే.. ఈ ఆలయాన్ని దర్శించాల్సిందే..!!

Ad

మన భారతదేశానికి భక్తి సాంప్రదాయం, ఆలయాలు అనేది పెట్టింది పేరు. మన దేశంలో ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క విధమైన ప్రత్యేకత ఉంటుంది. అయితే దేశంలో తమిళనాడు రాష్ట్రంలోని చాలా పురాతన ఆలయాలు ఉన్నాయి. ఈ ఒక్క రాష్ట్రంలో 1500 పురాతన ఆలయాలు ఉన్నాయంటే ఈ దేశం అంతా ఎన్ని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.. అయితే మనం దేవాలయాలకు వెళ్లి మనం కోరుకున్న కోరికలు నెరవేరాలని దేవున్ని ప్రార్థిస్తాం.. మరికొందరేమో మానసిక ప్రశాంతత కొరకు గుడికి వెళ్తుంటారు..అయితే ఇందులో చాలా ప్రసిద్ధి చెందిన ఒక ఆలయం కుంభకోణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిరుశక్తి మట్టం అనే గ్రామంలో శక్తి వశ్వర అనే ఆలయం ఉంది. ఇక్కడ భక్తుల తాకిడి ఎప్పుడు రద్దీగానే ఉంటుంది.. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఏంటో చూద్దామా..?అయితే పూర్వ కాలంలో పార్వతి దేవి శివున్ని చూసి మనసు పారేసుకుంటుంది. ఎలాగైనా ఆయన్ను భర్తగా పొందాలని ప్రతిరోజు ఆలయానికి వెళ్ళేది.ఈ విధంగా దర్శించిన పార్వతీదేవి ఓ రోజు ఏ మాత్రం భయపడకుండా శివుని వద్దకు వెళ్లి కౌగిలించుకుంది. దీంతో పార్వతీ ప్రేమను మేచ్చినటువంటి పరమశివుడు నిజ రూపంలో ప్రత్యక్షమై ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఇప్పటికీ ఆలయంలో పార్వతీదేవి శివున్ని కౌగిలించుకున్నటువంటి శిలాఫలకం కనబడుతుంది. అయితే పార్వతి దేవి తను ప్రేమించిన శివున్ని పతిగా పొందింది కాబట్టి, ప్రేమించిన వారిని మనం దక్కించుకోవాలంటే ఈ గుడికి వచ్చి ప్రార్థిస్తే తప్పకుండా జరుగుతుందని నమ్ముతుంటారు.

Advertisement

also read :

Advertisement

మ‌న‌సులో ఉన్న కోరిక‌ను బ‌య‌ట‌పెట్టిన ఉపాస‌న‌..!

రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

 

 

Visitors Are Also Reading