Home » అండర్-19 మహిళా టి20 ప్రపంచ కప్ విజేతగా టీమిండియా..BCCI కోట్ల వర్షం

అండర్-19 మహిళా టి20 ప్రపంచ కప్ విజేతగా టీమిండియా..BCCI కోట్ల వర్షం

by Bunty
Ad

అండర్-19 మహిళా టి20 ప్రపంచ కప్ విజేతగా టీం ఇండియా నిలిచింది. ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్ లో భారత అండర్-19 మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మహిళల క్రికెట్లో ఏ విభాగంలోనైనా భారత జట్టుకు ఇదే తొలి ఐసీసీ టైటిల్ కావడం విశేషం. ఫైనల్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండు ఓవర్లలో 68 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లు సదు, అర్చన దేవి, పర్షవీ చోప్రా రెండేసి వికెట్లు తీయగా, మన్నత్ కశ్యప్, షెఫాలీ వర్మ, సోనం యాదవ్ తలో వికెట్ తీశారు.

Advertisement

Advertisement

 

భారత బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు పేవిలియనుకు క్యూ కట్టారు. ర్యానా మాక్ డోనాల్డ్ టాప్ స్కోరర్ గా నిలవగా, ముగ్గురు బ్యాటర్లు డక్ అవుట్ అవ్వడం విశేషం. అనంతరం లక్ష్య చేధనకు దిగిన భారత అమ్మాయిలు 14 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అయితే, ఐసీసీ అండర్-19 టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి అభినందించింది.

జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి కలిపి రూ. 5 కోట్ల నజరానా ప్రకటించింది. మరోవైపు ఫైనల్లో ఇంగ్లాండ్ ను 7 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్స్ సాధించిన మహిళల టీం ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఈ యువ జట్టు భవిష్యత్తులో మరిన్ని టోర్నీలో విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

READ ALSO  : నందమూరి తారకరత్న సేఫ్.. డాక్టర్లకు అందని మిరాకిల్ !

Visitors Are Also Reading