Home » భార్యను ప‌ట్టించుకోకుండా మ‌రోమ‌హిళ‌తో సంబంధం….చివ‌రికి ఏ జ‌రిగిందంటే..?

భార్యను ప‌ట్టించుకోకుండా మ‌రోమ‌హిళ‌తో సంబంధం….చివ‌రికి ఏ జ‌రిగిందంటే..?

by AJAY
Ad

పెళ్లి త‌ర‌వాత భ‌ర్త ఏం చేసినా భార్య భ‌రిస్తుందేమో కానీ ప‌రాయి స్త్రీల‌తో సంబంధం పెట్టుకుంటే మాత్రం భ‌రించ‌లేదు. భర్త చేసిన మోసాన్ని త‌ట్టుకోలేదు. చివ‌రికి ఆ బాధ‌ను భ‌రించ‌లేక త‌న ప్రాణాల‌ను సైతం విడిచిపెట్ట‌డానికి వెన‌కాడ‌దు. తాజాగా అలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. భ‌ర్త ప‌రాయి స్త్రీ మోజులో ప‌డి త‌న‌ను ప‌ట్టించుకోవడం లేదని ఓ వివాహిత బ‌ల‌వన్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ లో చోటు చేసుకుంది.

Advertisement

వివ‌రాల్లోకి వెళితే…నిజామాబాద్ జిల్లాలోని ద‌ర్ప‌న‌ప‌ల్లి మండ‌లంలోని ద‌మ్మ‌న‌పేట్ తాండాకు చెందిన మంజుల‌కు సిరిసిల్ల‌కు చెందిన ప్ర‌సాద్ తో 2021 జ‌న‌వరి 8న వివాహం జ‌రిగింది. పెళ్లి స‌మ‌యంలో వ‌రుడికి భారీగా క‌ట్న‌కానుక‌లు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. పెళ్లి స‌మ‌యంలో వ‌రుడికి ప‌ది ల‌క్ష‌ల క‌ట్నం తో పాటూ ఎనిమిది తులాల బంగారం మ‌రియు ఫ్లాట్ ను అంద‌జేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక పెళ్లి త‌ర‌వాత దంప‌తులు హైద‌రాబాద్ కు బ‌తుకుదెరువు కోసం వ‌చ్చారు. ప్ర‌సాద్ హైద‌రాబాద్ లోనే ఉద్యోగం లో చేరాడు. వీరికి ఓ కుమారుడు జ‌న్మించాడు.

Advertisement

ఇక పెళ్లి త‌రవాత కొన్నాళ్లు వీరి కాపురం స‌క్ర‌మంగానే సాగింది. కానీ ప్ర‌సాద్ కొంత‌కాలం త‌ర‌వాత స్వ‌ప్న అనే మ‌హిళ‌తో సంబంధం పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. దాంతో త‌న కుమారుడిని త‌నను భ‌ర్త ప‌ట్టించుకోవడం లేద‌ని మంజుల తీవ్ర‌మ‌న‌స్థాపానికి గుర్తైంది. పెద్ద‌ల స‌మ‌క్షంలో పంచాయితీ పెట్టినా భ‌ర్త ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పురాక‌పోవ‌డంతో బల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ప్ర‌సాద్ ను అదుపులోకి తీసుకున్నారు.

Visitors Are Also Reading