Home » 40 ఏళ్లు దాటిన త‌ర‌వాత బిడ్డ‌ల‌కు జ‌న్మనిచ్చిన స్టార్ హీరోయిన్లు..!

40 ఏళ్లు దాటిన త‌ర‌వాత బిడ్డ‌ల‌కు జ‌న్మనిచ్చిన స్టార్ హీరోయిన్లు..!

by AJAY
Ad

సినిమా అనేది రంగుల ప్ర‌పంచం. అందులో విహ‌రించాల‌ని చాలా మందికి ఉంటుంది. హీరోల‌కు ఎక్కువ కాలం లైఫ్ ఉంటుంది కానీ హీరోయిన్ ల‌కు మాత్ర ఓ వ‌య‌సు వ‌స్తే అవ‌కాశాలు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. కాబ‌ట్టి దీపం ఉన్న‌ప్పుడే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌ని వ‌చ్చిన అవ‌కాశాలు అన్నింటిని స‌ద్వినియోగం చేసుకుంటారు. ఈ క్ర‌మంలో వారి నిజ‌జీవితం గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోరు. ఇక సినిమాల‌లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల‌ పెళ్లిని కూడా లేటుగానే చేసుకుంటారు. దాంతో లేటు వ‌య‌సులో పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వాల్సి వ‌స్తుంది. అలా 40 ఏళ్లు దాటిన త‌ర‌వాత పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన హీరోయిన్ లు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం…

Advertisement

అందాల‌తార ఐశ్వ‌ర్య‌రాయ్ 34 ఏళ్ల వ‌య‌సులో అభిషేక్ బ‌చ్చ‌న్ ను వివాహం చేసుకుంది. ఇక పెళ్లైన నాలుగేళ్ల‌కు అంటూ న‌ల‌భై ఏళ్ల‌కు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన త‌ర‌వాత ఐశ్వ‌ర్య ఆరాధ్య‌కు జ‌న్మ‌నిచ్చింది.


గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక చోప్రా 39 ఏళ్ల వ‌య‌సులో త‌ల్లైంది. నిక్ జోనాస్ ను ప్రేమ‌వివాహం చేసుకున్న ప్రియాంక చోప్రా 39 ఏళ్ల వ‌య‌సులో స‌రోగ‌సి ద్వారా బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

Advertisement


బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టి సైతం 38 ఏళ్ల వ‌య‌సులో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. దాంతో 40 ఏళ్ల వ‌య‌సులో త‌ల్లైన హీరోయ‌న్ ల లిస్ట్ లో చేరిపోయింది.


మ‌రో బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింతా ఏకంగా 46 ఏళ్ల వ‌య‌సులో ఓపాప‌కు మ‌రియు బాబుకు స‌రోగ‌సి విధానం ద్వారా జ‌న్మనిచ్చింది.

Madhuri with Husband and Son shown to user

ఎవ‌ర్ గ్రీన్ బ్యూటీ మాధురీ దీక్షిత్ కూడా 37 ఏళ్ల వ‌య‌సులో ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు.


టాలీవుడ్ బ్యూటీ శ్రీయ స‌ర‌న్ కూడా లాక్ డౌన్ స‌మ‌యంలో 39 ఏళ్ల వ‌య‌సులో ఓ బిడ్డ‌కు జ‌న్మనిచ్చారు.

ALSO READ :

Dasari…. చిరు, బాల‌య్య‌, నాగార్జున‌ల‌కు ఇచ్చిన ట్యాగ్ లైన్స్ ఏంటి? 1992 నాటి ముచ్చ‌ట‌!

ప్రాంక్ లొల్లి..గెట్ అవుట్ అంటూ విశ్వక్ సేన్ పై దేవినాగవల్లి ఫైర్…వీడియో వైరల్…!

Visitors Are Also Reading