Home » అందాల తార మాధవి మీకు గుర్తుందా..? ఆమె కూతుర్లు తల్లిని మించిపోయారుగా..!

అందాల తార మాధవి మీకు గుర్తుందా..? ఆమె కూతుర్లు తల్లిని మించిపోయారుగా..!

by Anji
Published: Last Updated on
Ad

అందం, అభినయంతో వెండి తెరపై ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు చాలా మంది హీరోయిన్లు. ఒకప్పుడు అగ్రకథానాయికలుగా ఓ వెలుగు వెలిగినప్పటికీ.. అంతలోనే సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు. స్టార్ హీరోలకు జంటగా నటించిన పలువుు హీరోయిన్లు.. పెళ్లిలు చేసుకొని విదేశాల్లో సెటిల్ అయిన కొందరు అయితే.. మరికొందరూ సహాయ పాత్రల్లో మెప్పిస్తున్నారు. వారిలో సీనియర్ నటి మాధవిర ఒకరు. 

Advertisement

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకు చెందిన మాధవి.. 1980-90లో శ్రీదేవి, విజయశాంతి, జయసుధ, జయప్రద వంటి స్టార్ హీరోయిన్లకు పోటీనిచ్చింది. ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్ చేసింది. అప్పట్లో ఈ జంటకి  ఎక్కువగానే అభిమానులు ఉండేవారు. చిరంజీవి ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో ప్రారంభమైన వీరి ప్రయాణం.. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, చట్టంతో పోరాటం, మరణశాసనం, రోషగాడు, కోతల రాయుడు, దొంగమొగుడు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, బిగ్ బాస్ సినిమా వరకు కొనసాగింది. చిరంజీవితో పాటు శోభన్ బాబు,  రజినీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి, అమితాబ్ బచ్చన్ స్టార్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ బ్యూటీ. దాదాపు అన్ని భాషల్లో కలిపి 300కి పైగా సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ, ఒరియా వంటి భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. 

Advertisement

తన సీని కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే అమెరికాకు చెందిన ఓ వ్యాపారవేత్త మ్యాన్ రాల్ప్ శర్మను మాధవి పెళ్లి చేసుకుంది. వీరికి టిఫాని శర్మ, ప్రసిల్లా శర్మ, ఎవ్లీన్ ముగ్గురు కుమార్తెలున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాధవి ముగ్గురు కూతుర్లు అందంలో తమ తల్లిని మించిపోయారు. ఒకవేళ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే.. హీరోయిన్లుగా తమకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం ఖాయం అని తెలుస్తోంది. మాధవి దంపతులు ప్రస్తుతం అమెరికాలోనే స్థిరపడ్డారు. సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మాధవి తన భర్తకు ఉన్న ఔషదాన సంస్థ బాధ్యతలను చూసుకుంటున్నారు. అదేవిధంగా ఫుడ్ బిజినెస్  లో కూడా రాణిస్తున్నారు. 

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు: 

Visitors Are Also Reading