Home » రామ్ చరణ్ ఇంటికి భారత ఆటగాళ్లు..!

రామ్ చరణ్ ఇంటికి భారత ఆటగాళ్లు..!

by Azhar
Ad
భారత ఆటగాళ్లు చాలా రోజుల తర్వాత హైదరాబాద్ లో ఒక్క మ్యాచ్ కోసం వచ్చిన విషయ తెలిసిందే. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా గెలిచి.. సిరీస్ కూడా కైవసం చేసుకుంది. నిన్న ఈ మ్యాచ్ అనేది ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఇంటికి వెళ్లినట్లు సోషల్ మీడియాలో వార్తలు అనేవి చెక్కర్లు కొడుతున్నాయి.
భారత జట్టులో కీలక ఆటగాడు అయిన హార్దిక్ పాండ్య, సూర్య కుమార్ యాదవ్ తో పేరుగా మరికొందరు ఆటగాళ్లు రామ్ చరణ్ ఇంటికి వెళ్లి డిన్నర్ చేసినట్లు తెలుస్తుంది. కానీ అసలు ఇండియా ఆటగాళ్లు ఉన్నటుండి.. రామ్ చరణ్ ఇంటికి ఎందుకు వెళ్లారు.. వారిని రామ్ చరణ్ పిలిచాడా.. లేక వీరే వెళ్ళారా అనే చర్చ అయితే బాగా జరుగుతుంది.
ఈ విషయంలో మెగా కాంపౌండ్ నుండి వస్తున్న సమాచారం ప్రకారం.. భారత ఆటగాళ్లే రామ్ చరణ్ ను కలవాలని అనుకున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యే రన్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా పెద్ద హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సినిమా చూసే చరణ్ ను కావాలని వారు అనుకున్నట్లు తెలుస్తుంది. ఇక రామ్ చరణ్ కూడా తనను కలవడానికి వచ్చిన ఆటగాళ్లకు మంచి డిన్నర్ అనేది ఏర్పాటు చేసాడు అని తెలుస్తుంది. ఇక రామ్ చరణ్ తో పాటుగా ఉపాసన కూడా మన ఆటగాళ్లను కలిసింది అని తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading