Home » హైదరాబాద్ బిర్యానీ కోసం గోల్కొండకు రోహిత్ శర్మ..!

హైదరాబాద్ బిర్యానీ కోసం గోల్కొండకు రోహిత్ శర్మ..!

by Azhar
హైదరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ అనేది చాలా రోజుల తర్వాత నిన్న జరిగింది. ఎప్పుడైనా ప్రతి ఏడాది ఐపీఎల్ మ్యాచ్ లు జరిగే హైదరాబాద్ లో కరోనా కారణంగా గత మూడేళ్ళుగా ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. కానీ నిన్న ఇండియా, ఆసీస్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ అనేది ఇక్కడ జరగా.. అందులో మన జట్టే విజయం సాధించింది.
ఇక మన హైదరాబాద్ కు ఏ విషయం  పైన ఎవరు వచ్చిన.. తప్పకుండ అందరూ ఇక్కడ స్పెషల్ అయిన హైదరాబాద్ బిర్యానీ అనేది టెస్ట్ చేస్తారు. భాగ్యనగరం వచ్చిన వారు దానిని టెస్ట్ చేయకపోతే బిర్యాయ్ వారి భాగ్యంలో లేనట్టే. అయితే టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. మన హైదాబాద్ స్పెషల్ బిర్యానీ కోసం గోల్కొండకు వచ్చాడు. నిన్న ఆదివారం జరిగిన మ్యాచ్ కోసం మొన్న శనివారమే ఇక్కడికి భారత జట్టుకు వచ్చింది.
అయితే అదే రోజు రాత్రి భారత ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఆహ్వానం మేరకు కోచ్ రాహుల్ ద్రావిడ్, రోహిత్  శర్మ అలాగే ఇతర కోచింగ్ సిబ్బంది అందరూ.. గోల్కొండ హోటల్ కు వెళ్లారు. అక్కడ హైదరాబాద్ బిర్యానీ రుచి చూసిన రోహిత్.. దానికి ఫిదా అయ్యాడు అని తెలుస్తుంది. బిర్యానీ రోహిత్ కు బాగా నచ్చింది అని సమాచారం. అందుకే తానే స్వయంగా ఆ హోటల్ సిబ్బందితో ఓ సెల్ఫీ కూడా దిగాడు హిట్ మ్యాన్.
Visitors Are Also Reading