Home » Guntur Karaam : “గుంటూరు కారం” సినిమాను మిస్ చేసుకున్న ఇద్దరు టాలీవుడ్ హీరోలు ?

Guntur Karaam : “గుంటూరు కారం” సినిమాను మిస్ చేసుకున్న ఇద్దరు టాలీవుడ్ హీరోలు ?

by Bunty
Ad

Guntur Karaam : ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని… ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు మహేష్ బాబు. గత రెండు సంవత్సరాలుగా థియేటర్ లలో సందడి చేయని మహేష్ బాబు ఈ సంక్రాంతికి రాబోతున్నాడు. గుంటూరు కారం సినిమాతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మహేష్ బాబు. త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్లో ఈ సినిమా వస్తోంది.

Advertisement

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు హైట్రిక్ విజయాన్ని నమోదు చేసేందుకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరీలు నటిస్తున్నారు. ఈ సినిమా ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవరనాగ వంశీ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా జనవరి 12వ తేదీన అంటే సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుంటూరు కారం సినిమాను మొదట జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని అనుకున్నారట. కొన్ని అనువార్య కారణాలవల్ల అది కుదరలేదట. ఇక మరికొంతమంది పవన్ కళ్యాణ్ కోసం ఈ సినిమాను త్రివిక్రమ్ రాసుకున్నారని చెబుతున్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading