Home » ఇంత లావుగా ఉన్న అమ్మాయి… ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అని తెలుసా !

ఇంత లావుగా ఉన్న అమ్మాయి… ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అని తెలుసా !

by Bunty
Ad

ఒకప్పుడు టాలీవుడ్ లో రాణించిన చాలామంది హీరోయిన్లు ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అలాంటి లిస్టులో సమీరా రెడ్డి కూడా ఒకరు. సమీరా రెడ్డి అంటే ఇప్పటి ప్రేక్షకులు గుర్తుపట్టకపోవచ్చు కానీ ఒకప్పుడు ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా రాణించింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నరసింహుడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఈ సినిమా కంటే ముందే బాలీవుడ్ లో సమీరా రెడ్డి సినిమాలు చేసింది.

Advertisement

కాగా ఎన్టీఆర్ తో సినిమా తర్వాత చిరంజీవి హీరోగా నటించిన జై చిరంజీవ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన అశోక్ సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా రానా హీరోగా ఇలియానా హీరోయిన్ గా నటించిన కృష్ణం వందే జగద్గురు సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించింది. అయితే తాజాగా ఈ హీరోయిన్ సమీరా రెడ్డి ఫోటో నెట్టింటిని షేక్ చేస్తుంది.

పైన ఫోటోను చూశారు కదా బొద్దుగా అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారిని మన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమీరా రెడ్డి కాగా, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి పాపులారిటీ సంపాదించుకున్న ఆమె పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. సమీరారెడ్డి, ఎంట్రప్రెన్యూనర్ అక్షయ్ వర్డె ను 2014లో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి సమయాన్ని గడుపుతున్నారు.

READ ALSO : టీమిండియా క్రికెటర్‌ భార్యను మోసం చేసిన హైదరాబాదీలు !

Visitors Are Also Reading