Home » ఈ నెల 15 నుంచి 25 వరకు మేడారం జాతరలో ఉచిత వైఫై..!

ఈ నెల 15 నుంచి 25 వరకు మేడారం జాతరలో ఉచిత వైఫై..!

by Anji
Ad

ఆసియా  ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర. నాలుగు రోజుల పాటు సాగనున్న ఈ జాతరకు దేశ, విదేశాల నుంచి దాదాపు కోటి మంది వరకు భక్తుల వరకు వస్తారని అంచనా. గిరిజనులు ప్రధానంగా ఆరాధించే దేవతలు మేడారం సమ్మక్క- సారలమ్మ. ప్రతి రెండేళ్లకోసారి మాఘ పౌర్ణమికి ముందు నాలుగురోజుల పాటు ఈ మహా జాతర జరుగుతుంది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఈ జాతర జరగనుంది. అమ్మవార్లు గద్దెల మీద కొలువుతీరిన రోజు నుంచి కోట్లాది మంది గిరిజనులు, గిరిజనేతరులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి వస్తారు. పసుపు కుంకుమలను, వొడి బియ్యాన్ని, బంగారాన్ని (బెల్లం) సమర్పిస్తారు. కోడి పుంజులు, మేకపోతులను బలి ఇస్తారు.

Advertisement

Advertisement

మేడారం జాతకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో ఏర్పాట్లను చేసింది. భక్తుల సౌకర్యాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. రవానా, భోజనం, మంచినీరు లాంటి వాటితో పాటూ ఇప్పుడు ఉచిత వైఫై ను కూడా భక్తులకు అందించాలని డిసైడ్ అయింది. దీని కోసం బీఎస్ఎన్ఎల్‌ ను రంగంలోకి దింపింది. ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతంలో జరిగే ఈ జాతరలో కమ్యూనికేషన్ లేక భక్తులు తరుచూ ఇబ్బందులు పడుతుంటారు. ఇక మీదట అలా జరగకూడదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్  మేడారం మహాజాతరలో మెరుగైన సేవలందించేందుకు సిద్ధమైంది. జాతరలో సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు భక్తులకు ఉచిత వైఫై సేవలందించేందుకు కసరత్తు చేస్తోంది.

 

ములుగు ఎంట్రన్స్ లోని గట్టమ్మ గుడి, కొత్తూరు రోడ్‌, కొత్తూరు స్కూల్‌, ఊరట్టం క్రాస్ రోడ్డు, కాజ్‌వే, రెడ్డిగూడెం స్కూల్‌, హరిత హోటల్‌, నార్లాపూర్‌, ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌, ఐటీడీఏ గెస్ట్‌ హౌస్‌, బస్టాండ్‌, వాచ్‌ టవర్‌, ఆసుపత్రుల వద్ద ఒక్కొక్కటి, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్‌, మేడారం అమ్మవారి గద్దెల ప్రాంతాల్లో హాట్‌ స్పాట్‌లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ హాట్ స్పాట్ సెంటర్లకు వంద అడుగుల లోపు ఏ నెట్ వర్క్ వినియోగదారులైనా సులభంగా లాగిన్ అయి వైఫై సేవలు వినియోగించుకోవచ్చు. 10 నుంచి 20 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో వన్ జీబీ వరకు డేటా వాడుకోవచ్చు.

Visitors Are Also Reading