Home » BREAKING : మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూత

BREAKING : మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూత

by Bunty
Ad

ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ మాజీ ముఖ్య మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత కొణిజేటి రోశ‌య్య మ‌రణించారు. 88 సంవ‌త్స‌రాలు ఉన్న మాజీ ముఖ్య మంత్రి, కొణిజేటి రోశ‌య్య తీవ్ర ఆనారోగ్యంతో మ‌రణించారు. ఒక్కసా రి గా బీపీ డౌన్ కావడంతో ఆస్పత్రికి ఇవాళ ఉద‌యం రోశ‌య్య‌ను తరలించారు ఆయ‌న కుటుంబ స‌భ్యులు. హైద‌రాబాద్ లోని స్టార్ ఆస్పత్రికి రోశ‌య్య ను తరలించారు ఆయ‌న‌ కుటుంబ సభ్యులు.

Also Read: ఆ రికార్డు రోశయ్య కే సొంతం…!

Advertisement

Advertisement

అయితే…. ఆస్పత్రికి వెళ్లగానే రోశయ్య చనిపోయినట్లుగా నిర్ధారించారు వైద్యులు. ఇంటి దగ్గర నుంచి ఆస్పత్రి కి మార్గమధ్యంలోనే రోశయ్య మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. దీంతో రోశయ్య పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకువస్తున్నారు ఆయ‌న‌ కుటుంబ సభ్యులు.ఇక రోశ‌య్య మృతి ప‌ట్ల ప‌లుగురు రాజ‌కీయ నాయ‌కులు, ఆయ‌న అభిమానులు సంతాపం వ్య‌క్తం చేశారు. కాగా.. రోశ‌య్య అంత్య క్రియ‌లు రేపు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం అందుతోంది.

Also Read: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య రాజకీయ నేపథ్యం

Visitors Are Also Reading