Home » అక్కినేని కుటుంబాన్ని ఆ శాపం వెంటాడుతోందా.. అందుకే విడాకులు అంటూ?

అక్కినేని కుటుంబాన్ని ఆ శాపం వెంటాడుతోందా.. అందుకే విడాకులు అంటూ?

by Bunty
Ad

అక్కినేని ఫ్యామిలీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలోని అతిపెద్ద కుటుంబాలలో వీరి కుటుంబం కూడా ఒకటి. టాలీవుడ్ కి రెండు కళ్లుగా చెప్పుకునే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తమ తమ వారసత్వ సామ్రాజ్యాలు నిర్మించిపోయారు. ఏఎన్నార్ లెగసీని కొడుకు నాగార్జున ముందుకు తీసుకెళ్లారు. టాప్ స్టార్ గా ఎదిగి తండ్రి వారసత్వం నిలబెట్టారు. నాగార్జున తర్వాత ఆ పరిశ్రమకు పరిచయమైన సుమంత్, సుశాంత్ ఏమంత ప్రభావం చూపించలేకపోతున్నారు.

Advertisement

నాగార్జున కొడుకులు చైతన్య, అఖిల్ మాత్రం తమ మార్క్ క్రియేట్ చేశారు. చైతన్య ఇప్పటికే హీరోగా నిలదొక్కుకున్నాడు. అఖిల్ మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది ఇలా ఉంటే, అక్కినేని కుటుంబానికి చెందిన వ్యక్తుల లైఫ్ పార్ట్నర్ కు సంబంధించి ఎన్నో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. హీరో నాగార్జున మొదట వెంకటేష్ సోదరి లక్ష్మీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల నాగార్జున, లక్ష్మీ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగార్జున, అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత నాగార్జున అమల అన్యోన్యంగా ఉన్నారు. హీరో సుమంత్ హీరోయిన్ కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కీర్తి రెడ్డి సుమంత్ మధ్య మనస్పర్ధలు వచ్చాయి.

Advertisement

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సుప్రియ హీరో చరణ్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చరణ్ రెడ్డి అనారోగ్య సమస్యల వల్ల చనిపోగా, వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని తెలుస్తోంది. హీరో అఖిల్ కు శ్రియ భూపాల్ తో నిశ్చితార్థం జరగగా కొన్ని కారణాల వల్ల పెళ్లి ఆగిపోయింది. తాజాగా నాగచైతన్య, సమంత కూడా విడాకులు తీసుకోవడం గమనార్హం. దీంతో అక్కినేని కుటుంబానికి ఏదో శాపం తగిలిందని, ఆ శాపం వల్లే ఈ విధంగా జరుగుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి : కన్నడ ఇండస్ట్రీ బ్యాన్.. లోపల జరిగేది వేరంటూ నోరు విప్పిన రష్మికా మందన్న

Visitors Are Also Reading