Home » గ్రూప్-1 దరఖాస్తుల గడువు పెంపు.. ఎప్పటి వరకు అంటే..?

గ్రూప్-1 దరఖాస్తుల గడువు పెంపు.. ఎప్పటి వరకు అంటే..?

by Anji
Ad

తెలంగాణ గ్రూప్‌ 1 అభ్యర్ధులకు గుడ్‌న్యూస్.. గ్రూప్‌ 1 ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును పొడిగిస్తూ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ టీఎస్‌పీఎస్సీ గురువారం మార్చి 14న ప్రకటన వెలువరించింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటలతో దరఖాస్తు గడువు ముగిసింది. మరో రెండు రోజులపాటు దరఖాస్తు గడువును పొడిగిస్తూ అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని.. అభ్యర్ధులు మార్చి 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.

Advertisement

Advertisement

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గత నెల 19న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. దరఖాస్తులకు గడువు గురువారం సాయంత్రం ముగియడంతో మరో రెండు రోజులు పొడిగించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9వ తేదీన, మెయిన్స్ అక్టోబర్ 21నుంచి నిర్వహించనున్నట్టు ఇప్పటికే కమిషన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read :  నాగబాబు కూతురుకి జగన్ సర్కార్ బిగ్ షాక్..!

Visitors Are Also Reading