Home » తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌భాస్ అభిమానులు ఫుల్ ఖుషి..!

తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌భాస్ అభిమానులు ఫుల్ ఖుషి..!

by Anji
Ad

రాధేశ్యామ్ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా యావ‌త్ దేశం మొత్తం సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ నటించిన సినిమా రాధేశ్యామ్‌ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా రేపట్నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

Advertisement

Advertisement

పలుమార్లు ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు శుక్రవారం ప్రేక్షకులను అలరించేందుకు వస్తుండడంతో ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సిద్ధమయ్యారు. ఈ తరుణంలో తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ కు తెలంగాణ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. రాధేశ్యామ్ సినిమాకు ఐద‌వ షోకు అనుమ‌తి ఇచ్చిన‌ట్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. మార్చి 11 నుంచి 25 వ‌ర‌కు రాధేశ్యామ్ సినిమాకు ఐద‌వ షో ర‌న్ చేసుకోవ‌చ్చు. తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఫ్యాన్స్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read :  జాగ్వార్, పాంథ‌ర్ ల‌ను విడిచి ఉక్రెయిన్ వ‌దిలి రానంటున్న ఏపీ వాసిపై చిరు ఆస‌క్తిక‌ర కామెంట్స్…!

Visitors Are Also Reading