Home » “నువ్వు నేను” వసు గుర్తుందా.. తల్లయిన తరగని అందం..లేటెస్ట్ ఫోటోలు చూస్తే..!!

“నువ్వు నేను” వసు గుర్తుందా.. తల్లయిన తరగని అందం..లేటెస్ట్ ఫోటోలు చూస్తే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

నువ్వు నేను సినిమా పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది ఉదయ్ కిరణ్, హీరోయిన్ అనిత, ఆ తర్వాత తెలంగాణ శకుంతల, తనికెళ్ల భరణి..ఈ చిత్రంలో వీరి యాక్టింగ్ మామూలుగా ఉండదు. ఇక అనిత ఈ ఒక్క మూవీతోనే తన పేరు ఇండస్ట్రీలో మార్మోగేలా చేసుకుందని చెప్పవచ్చు. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. 2001లో వచ్చిన ఈ మూవీ ద్వారా అనిత ఇండస్ట్రీకి పరిచయమైంది.

Advertisement

Also Read:బంగారం లాంటి అమ్మాయి.. 3 కోట్ల కట్నం..  తాళి కట్టడానికి ముందు ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

ఇందులో అనిత పోషించిన వసు పాత్రకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఈ చిత్రంలో తన అందం, అభినయంతో అనిత మంచి గుర్తింపును సాధించింది. ఆ తర్వాత వరుసగా తొట్టి గ్యాంగ్, నిన్నే ఇష్టపడ్డాను, శ్రీరామ్,ఆడంతే అదో టైపు, నేను పెళ్లికి రెడీ వంటి సినిమాలు చేసి ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయింది. అలాగే తమిళ,హిందీ,కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసి అలరించింది. తన కెరియర్ పీక్స్ లో ఉండగానే అనిత 2013 అక్టోబర్లో గోవాలో కార్పొరేట్ ప్రొఫెషనల్ రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకుంది.

Advertisement

Also Read:మెగాస్టార్ కూతురితో ఉదయ్ కిరణ్ పెళ్లి..అతని వల్లే ఆగిపోయిందట…!

వీరి యొక్క ప్రేమ బంధానికి గుర్తుగా 2021 ఫిబ్రవరిలో ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిల్లాడి పేరు ఆరవ్. ఇక వివాహమైన తర్వాత అనిత సినిమాలు చేయడం మానేసి బాలీవుడ్లో టీవీ సీరియల్స్ చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే అనిత తన బాబు ఫోటోలను షేర్ చేస్తూ, తన గ్లామరస్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేయడంతో అనిత అందం తల్లయ్యాక మరింత పెరిగిందని ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Also Read:ఇండియ‌న్ క్రికెట‌ర్స్ వారి అంద‌మైన భార్య‌లు!

Visitors Are Also Reading