Home » సుభాష్ చంద్రబోస్ ఐసీఎస్ లో ఉత్తీర్ణత సాధించి కూడా ఉద్యోగంలో ఎందుకు చేరలేదో తెలుసా ?

సుభాష్ చంద్రబోస్ ఐసీఎస్ లో ఉత్తీర్ణత సాధించి కూడా ఉద్యోగంలో ఎందుకు చేరలేదో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

ఇవాళ స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి. బోస్ పుట్టిన రోజును శౌర్య దినోత్సవంగా జరుపుకుంటారు. 2021లో బోస్ జయంతిని శౌర్య దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విద్యార్హతలు ఏంటి..? ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా.. బోస్ ఎందుకు ఆ ఉద్యోగంలో చేరలేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

subash-chandra-bose

Advertisement

 

సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న ఒడిశాలోని బెంగాల్ డివిజన్ లోని కటక్ లో జన్మించారు. తన తల్లిదండ్రులకు బోస్  9వ సంతానం. బోస్ నాటి కలకత్తాలో ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తరువాత తదుపరి చదువుల కోసం ఇంగ్లండ్ కి వెళ్లారు. బోస్ కేవలం తన 24 ఏళ్ల వయస్సులోనే ఐసీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఉన్నత ఉద్యోగాల అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే ఈ పరీక్షలో ఉత్తీర్నత సాధించినప్పటికీ.. బ్రిటీష్ వారికి బానిసగా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ ఉద్యోగంలో చేరలేదు.

Advertisement

స్వాతంత్య్ర పోరాటం కాలు మోపేందుకు ఇంగ్లాండ్ నుంచి భారత్ కి తిరిగి వచ్చాడు బోస్. ప్రముఖ నేత చిత్తరంజన్ దాస్ తో జత కట్టారు. 1921లో చిత్తరంజన్ దాస్ కి చెందిన స్వరాజ్ పార్టీ ప్రచురించే ఫార్వర్డ్ అనే వార్త పత్రికకు సంపాదకత్వ బాధ్యతలను స్వీకరించారు బోస్. 1920 నుంచి 1942 వరకు స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఆవిస్కరింపజేసే ది ఇండియన్ స్ట్రగుల్ అనే పుస్తకాన్ని రచించారు బోస్. 1939లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కొంత కాలానికే  పదవీకి రాజీనామా చేశారు.  జీవిత కాలంలో 11 సార్లు జైలు శిక్ష అనుభవించారు.

Visitors Are Also Reading