Home » యమదొంగ తరువాత రాజమౌళి మోహన్ బాబుని ఎందుకు రిపీట్ చేయలేదో తెలుసా ?

యమదొంగ తరువాత రాజమౌళి మోహన్ బాబుని ఎందుకు రిపీట్ చేయలేదో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాదు.. దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన దర్శకుల్లో దర్శక ధీరుడు రాజమౌళి ఒకరు. టాలీవుడ్ లో స్టూడెంట్ నెంబర్ వన్ తో దర్శకుడిగా పరిచయమై.. RRR వరకు ఆయన తెరకెక్కించిన సినిమాలు అన్ని కూడా సూపర్ హిట్ సాధించినవే. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ మూవీని పాన్ వరల్డ్ లో తెరకెక్కించి తన సత్తా ఏంటో నిరూపించుకునేందుకు సిద్ధం అవుతున్నాడు.

Advertisement

ఇదిలా ఉంటే.. రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో యమదొంగ మూవీని తెరకెక్కించాడు. ఇందులో యముడి క్యారెక్టర్ లో మోహన్ బాబుని తీసుకున్నారు. ఆ క్యారెక్టర్ మోహన్ అద్భుతంగా నటించడమేకాకుండా.. జీవించాడనే చెప్పాలి. దీంతో మోహన్ బాబు కి అలా అవార్డులు రావడంతో పాటు, విమర్శకుల ప్రశంసలు సైతం పొందాడు. అలాంటి మోహన్ బాబును రాజమౌళి తన తదుపరి సినిమాలో కంటిన్యూ చేయకపోవడానికి గల కారణం ఏంటి అనే డౌట్ అందరిలో నెలకొంది. మోహన్ బాబు మంచి నటుడే అయినప్పటికీ యమదొంగ సినిమా షూటింగ్ సమయంలో మోహన్ బాబు రాజమౌళితో మా విష్ణు తో సినిమా ఎప్పుడు చేస్తావో చెప్పు అంటూ అడిగేవాడట. ఎప్పుడూ అదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాజమౌళిని టార్చర్ పెడుతూ ఉండేవాడట.

Advertisement

ఇప్పటికే రాజమౌళి చాలా కమిట్ మెంట్స్ ఉండటంతో ఆయనకి ఏం చెప్పాలో తెలియక త్వరలోనే చేద్దామని చెప్పాడట. అప్పటికీ కూడా మోహన్ బాబు సరిగ్గా అర్థం చేసుకోకుండా ఎప్పుడు చేస్తావో సరిగ్గా క్లారిటీగా చెప్పు అన్నట్టుగా రాజమౌళిని ఒక అడగడంతో రాజమౌళి షూటింగ్ చేసిన దానికంటే మోహన్ బాబు పెట్టే టార్చరే ఎక్కువగా అయిపోయిందట. దీంతో యమదొంగ తరువాత మరో సినిమాలో మోహన్ బాబు ని రిపీట్ చేయవద్దు అని అప్పుడే ఫిక్స్ అయ్యాడట. అందుకే రాజమౌళి సినిమాల్లో మోహన్ బాబుకి సెట్ అయ్యే క్యారెక్టర్లు ఉన్నప్పటికీ.. ఆయనకి అవకాశం ఇవ్వడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read :  అక్కినేని నాగేశ్వరరావు రామ్ గోపాల్ వర్మ మీద అరవడానికి కారణం ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading