Home » వెంకటేష్ ని కాదని నాగార్జున ఎందుకు ఆ సినిమా చేశాడో తెలుసా ?

వెంకటేష్ ని కాదని నాగార్జున ఎందుకు ఆ సినిమా చేశాడో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ హీరోలు విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇండస్ట్రీలో వీరు అగ్ర హీరోలుగా రాణిస్తున్నారు. అయితే  ఒకప్పుడు ఇండస్ట్రీలో వెంకటేష్, నాగార్జున మధ్య పోటీ ఉండేది. వీరిద్దరికీ ఎక్కువగా మాటలు కూడా ఉండకపోయేవని అప్పట్లో ఇండస్ట్రీలో పలు కథనాలు కూడా వచ్చేవి. ఎందుకు అంటే..? వెంకటేష్ సిస్టర్ లక్ష్మీని నాగార్జున పెళ్లి చేసుకున్నారు. నాగచైతన్య పుట్టిన తరువాత ఆమెకు విడాకులు ఇవ్వడంతో వీరిద్దరి మధ్య మాటలు లేవని చాలా వార్తలు వినిపించాయి.

Advertisement

రీసెంట్ గా నాగచైతన్య హీరోగా చేస్తున్న తండేల్ మూవీ ఓపెనింగ్ ఫంక్షన్ కి వీరిద్దరూ చీఫ్ గెస్ట్ లుగా హాజరయ్యారు. వీరు నాగచైతన్యను ఆశీర్వదించారు. దీంతో వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవు అనే విషయం మాత్రం క్లారిటీ వచ్చింది. అయితే ఒకానొక సమయంలో వెంకటేష్ చేయాల్సిన సినిమాని నాగార్జున వెంకటేష్ మీద కోపంతో తనే చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. నిన్నే పెళ్ళాడుతా సినిమా ని కృష్ణవంశీ ముందుగా వెంకటేష్ కి చెప్పాడు. అయితే వెంకటేష్ ఆ సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడు. అయినప్పటికీ రామ్ గోపాల్ వర్మ తో నాగార్జున శివ సినిమా చేసినపుడు నాగార్జునకి కృష్ణవంశీ బాగా పరిచయం.

Advertisement

ఆ పరిచయాన్ని ఆసరా చేసుకొని కృష్ణవంశీని పిలిపించుకొని స్టోరీ విని ఈ సినిమా మనం చేద్దాం అని చెప్పి అప్పటికప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై   నిన్నేపెళ్లాడుతా మూవీ చేశాడు. దీంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలా వెంకటేష్ మీద కోపంతో నాగార్జున చేసిన సినిమా ఆయన కెరీయర్ లోనే ఒక బెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. అలాగే నాగార్జునకి సపరేట్ ఇమేజ్ ని కూడా తీసుకొచ్చి పెట్టింది.  ఈ సినిమా తో ఆయన మరొక హిట్ అందుకొని ముందుకు దూసుకెళ్లాడు. ఇదిలా ఉంటే.. 2024 సంక్రాంతి పండుగకు ఈ ఇద్దరూ హీరోలు పోటీ పడుతున్నారు. సైంధవ్ తో వెంకటేష్, నా సామి రంగ మూవీతో నాగార్జున ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading