Home » శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎందుకు చేస్తారో మీకు తెలుసా..?

శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎందుకు చేస్తారో మీకు తెలుసా..?

by Anji
Ad

సాధారణంగా హిందువులు జరుపుకునే పండుగలలో శివరాత్రి పండుగ ముఖ్యమైనదే. సాధారణంగా శివ రాత్రి పండుగ రోజు చాలా మంది ఉపవాసం ఉంటారు. అదేవిధంగా జాగారం కూడా చేస్తారు. శివరాత్రి పండుగ రోజు ఉపవాసం, జాగారం ఎందుకు చేస్తారో చాలా మందికి తెలియదు. దాని వెనుక చాలా పెద్ద కథనే ఉంది. అది ఏంటంటే.. ? కైలాస పర్వతంపై పార్వతిదేవి భర్తతో పాటు కూర్చొంది. ఆసమయంలో అన్ని వ్రతాల కంటే ఉత్తమమైన వ్రతం ఏదని అడిగింది. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతం అని సమాధానం చెప్పాడు. ఈ వ్రతాన్ని మాఘ బహుళ చతుర్దశి రోజు మాత్రమే ఆచరించాలని.. తెలిసి చేసినా తెలియక చేసినా యమదండన నుంచి తప్పించుకోవచ్చు అని వివరిస్తూ శివుడు ఈ కథ చెప్పుకొచ్చాడు. 

Advertisement

 పూర్వకాలంలో పర్వత ప్రాంతంలో వ్యాధుడు అనే వేటగాడు ఉండేవాడు. అతను నిత్యం అడవికి వేటకు వెళ్లి సాయంత్రం వరకు కచ్చితంగా ఏదో ఒక జంతువును చంపి ఇంటికి తీసుకొచ్చేవాడు. ఓ రోజు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత వెతికినా ఏ జంతువు దొరకలేదు. బయలుదేరిన సమయం బాలేదని భావించి ఖాళీ చేతులతో ఇంటికి బయలుదేరాడు. దారిలో ఓ వాగు కనిపించగానే వేటగాడికి ఒక ఆలోచన వచ్చింది. అక్కడికి నీరు తాగేందుకు జంతువులు తప్పకుండా వస్తాయని భావించి పక్కనే ఉన్న ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. తన చూపులకు అడ్డంగా వచ్చిన ఆకులను, కాయలను విరిచి కింద పడేశాడు. అప్పుడు చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ఆ సమయంలో శివ శివ అంటూ గజ గజ వణుకుతూ విల్లు ఎక్కి పెట్టి జంతువుల కోసం ఎదురుచూసాడు. ఎట్టకేలకు తెల్లారేసరికి ఒక జింక మాత్రమే కనిపించింది. వెంటనే బాణాన్ని ఎక్కు పెట్టాడు. అది చూసిన జింక వ్యాధుడా నన్ను చంపకు అని మనిషిలా మాట్లాడింది. 

Also Read :  వేసవి కాలంలో గోరు వెచ్చని నీరు తాగితే ఏమవుతుందో తెలుసా ? 

Advertisement

 

 

వ్యాధుడు ఆశ్చర్యపోయి మనిషి మాదిరిగా మాట్లాడుతున్నావు.. ఎవ్వరూ నువ్వు అని అడిగాడు. దీనికి ఆ లేడీ సమాధానం ఇస్తూ.. “నేను పూర్వ జన్మలో రంభను” అని సమాధానం ఇచ్చింది. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని ప్రేమించి శివుడి పూజను పక్కన పెట్టేశాను. ఆ సమయంలో శాపం నుంచి ఇప్పుడు విముక్తి లభించిందని చెబుతుంది. కొద్ది సేపటి తరువాత మరొక జింక వచ్చింది. దానిపై బాణం వేసే లోగా అది కూడా మనిషి లా మాట్లాడింది. ఓ వ్యాధుడా “నేను చనిపోయినా కూడా నీ కుటుంబానికి సరిపోను”. ఇక్కడికి మరో మగ జింక కొద్ది సేపట్లో వస్తుంది. దానిని చంపుకో.. లేదంటే “నేను తిరిగి వస్తాను” అని వ్యాధుడికి చెప్పడంతో దానిని కూడా వదిలేస్తాడు. అలా నాలుగు జింకలు వచ్చి వెళ్లిపోతాయి. మరో జింక కోసం ఎంతో ఆశగా ఎదురుచూశాడు వ్యాధుడు.

Also Read :  ఈసారి శివరాత్రి రోజే శని త్రయోదశి.. పండితులు ఏమంటున్నారంటే..?

ఆ తరువాత రోజు నాలుగు జింకలు వచ్చి “నన్ను మొదట చంపు అంటే.. నన్ను చంపు” అంటూ వేటగాడి ముందు మోకరిల్లాయి. ఆ జింకల నిజాయితికీ వ్యాధుడు ఆశ్చర్యపోయి ఇకపై హింస చేయను అని విల్లు వదిలేసి వెళ్లిపోతాడు. ఇంతలో ఆకాశం నుంచి పూల వర్షం కురుస్తుంది. శివరాత్రి సందర్భంగా ఉపవాసం, జాగరణం చేయడం ఆ రోజు రాత్రి వేటగాడు ఎక్కిన చెట్టు బిల్వవృక్షం కావడం దానిపై నుంచి ఆకులు కొమ్మలు కింద పడేశాడు కదా.. అక్కడ శివలింగం ఉండటం ఇలా అన్నీ కలిసి వచ్చాయి. తనకు తెలియకుండానే శివలింగాన్ని పూజించడంతో పాపం పోయిందని చెబుతారు దేవదూతలు. అందుకే శివరాత్రి రోజు జాగరణ, ఉపవాసం, బిళ్వ పత్రాలతో పూజ అత్యంత విశిష్టమైనవి అని వివరిస్తాడు శివుడు. 

Also Read :  ఇంటికి ఆ దిశలో చెప్పులు ఉంచితే అప్పుల పాలవ్వడం ఖాయం..!

Visitors Are Also Reading