Home » పెళ్లిలో అరుంధ‌తి న‌క్ష‌త్రాన్ని ఎందుకు చూపిస్తారో మీకు తెలుసా..?

పెళ్లిలో అరుంధ‌తి న‌క్ష‌త్రాన్ని ఎందుకు చూపిస్తారో మీకు తెలుసా..?

by Anji
Ad

సాధార‌ణంగా పెళ్లి అంటే అంద‌రి కుటుంబాల్లో సంతోషం ఉంటుంది. మ‌నిషి జీవితంలో పెళ్లి అనేది చాలా కీల‌క‌మైన ఘ‌ట్టంగా భావిస్తుంటారు. పెళ్లి కార్య‌క్ర‌మంలో ప‌లు సంప్ర‌దాయాలుంటాయి. పెళ్లి ముగిసిన త‌రువాత హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం.. అరుంధ‌తి న‌క్ష‌త్రానికి చాలా ప్రాధాన్య‌త ఉంటుంది. వివామ వేడుక‌లో కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న వ‌ధూవ‌రుల‌కు పురోహితుడు క‌చ్చితంగా అరుంధ‌తి న‌క్ష‌త్రాన్ని చూపిస్తుంటారు. అస‌లు అరుంధ‌తి న‌క్ష‌త్రం అంటే ఏంటి..? అది ఎందుకు పెళ్లిలోనే చూపిస్తార‌నే విష‌యాల‌పై చాలా మందికి ఎన్నోసార్లు సందేహాలు వ‌స్తుంటాయి. వాటి గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి:  తెలుగు సినిమా హీరోల‌కి చుర‌క‌లు అంటింటిచిన జ‌స్టీస్ ఎన్వీ ర‌మ‌ణ‌.. అందుకోస‌మేనా..?

Advertisement

అరుంధ‌తి అన‌గా వ‌శిష్ట మ‌హ‌ర్సి భార్య‌. బ్ర‌మ్మ కుమార్తె పేరు సంధ్యాదేవి. త‌న‌కు ఉప‌దేశం చేసేందుకు బ్ర‌హ్మ‌చారి కోసం వెతుకుతున్న స‌మ‌యంలో వ‌శిష్ట మ‌హాముని క‌నిపిస్తాడు. ఆమె అత‌డే త‌న‌కు ఉప‌దేశం చేసేందుకు త‌గిన వాడు అని భావించి అత‌డిని ఆశ్ర‌యించింది. బ్ర‌హ్మ‌చారి వ‌శిష్టుడు సంధ్యాదేవికి చేయ‌డానికి అంగీక‌రించాడు. అనంత‌రం సంధ్యాదేవి త‌న శ‌రీరానికి అగ్నికి ఆహుతి చేసుకుంటుంది. అగ్ని నుంచి ప్రాతః సంధ్య సాయం సంధ్య‌ల‌తో పాటు ఒక స్త్రీ రూపం వెలువ‌డ‌డ్డాయి. అంద‌మైన స్త్రీ రూప‌మే అరుంధ‌తి. ఆ అపురూప సౌంద‌ర్య రాశి అరుంధ‌తిపై వ‌శిష్టుడు మ‌న‌సు ప‌డ్డాడు. ఆమెను వివాహం చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. వీరిద్ద‌రూ పెళ్లి చేసుకునే స‌మ‌యంలో వ‌శిష్టుడు త‌న క‌మాండ‌లాన్ని అరుంధ‌తికి ఇచ్చి తాను తిరిగి వ‌చ్చేంత వ‌ర‌కు చూస్తుండ‌మ‌ని చెప్పి వెళ్తాడు. అలా ఏళ్లు గ‌డిచిపోయాయి. అయిన‌ప్ప‌టికీ వ‌శిష్టుడు రాక‌పోవ‌డంతో అరుంధ‌తి ఆ క‌మండ‌లాన్ని చూస్తుండిపోయింది.

Advertisement

ఇవి కూడా చదవండి:  సావిత్రి అలా దిగజారిపోకూడదు కదా అంటూ సీనియర్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..వీడియో వైరల్….!

అలా చూస్తూ ఉండిపోయిన అరుంధ‌తిని ఎంద‌రో పండితులు ఆమెను చూపు మ‌రిచాల‌ని చెప్పిన‌ప్ప‌టికీ ఆమె మాత్రం క‌మండ‌లంపై నుంచి చూపు తిప్ప‌లేదు. ఇక చేసేది లేక వ‌శిష్టుడిని వెతికి తీసుకొచ్చి ఆమె ముందు నిల‌బెట్టారు. ఆయ‌న రాక‌తో త‌న చూపును క‌మండ‌లం నుంచి వ‌శిష్టుడి వైపు మ‌ర‌ల్చింది. అప్ప‌టి నుంచి అరుంధ‌తి మ‌హాప‌తివ్ర‌త‌గా నిలిచిపోయింది. అరుంధ‌తి త‌న అకుంఠిత దీక్ష‌తో న‌క్ష‌త్ర రూపంలో వెలుగుతూ ఆకాశంలో చిర‌స్థాయిగా నిలిచిపోయింది. అందుకే మూడు ముళ్లు వేసిన త‌రువాత పెళ్లికొడుకు పెళ్లికూతురుకు అరుంధ‌తి న‌క్ష‌త్రం చూపిస్తాడు. అరుంధ‌తిలా స‌ద్గుణాలు క‌లిగి ఉండాల‌ని ఆ బంధం అరుంధ‌తి వ‌శిష్టుల చిర‌స్థాయిగా నిలిచిపోవాల‌ని కోరుకుంటూ ఆ న‌క్ష‌త్రాన్ని చూస్తారు.

ఇవి కూడా చదవండి:  వైరల్ అవుతున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పెళ్లి పత్రిక చూసారా ?

 

Visitors Are Also Reading