Home » ధనుష్‌ కెప్టెన్‌ మిల్లర్‌ ట్రైలర్‌ను ఎవరు లాంఛ్ చేయనున్నారో తెలుసా..?

ధనుష్‌ కెప్టెన్‌ మిల్లర్‌ ట్రైలర్‌ను ఎవరు లాంఛ్ చేయనున్నారో తెలుసా..?

by Anji
Ad

ధనుష్‌  టైటిల్‌ రోల్‌లో నటించిన కెప్టెన్‌ మిల్లర్‌  కోలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. కాగా అరుణ్‌ మథేశ్వరన్‌ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 12న ప్రపంచవాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. కాగా కెప్టెన్ మిల్లర్‌ తెలుగు వెర్షన్‌ తెలుగు రాష్ట్రాల్లో జనవరి 25న విడుదల కానున్న విషయం తెలిసిందే. తెలుగులో ఈ మూవీని సురేశ్‌ ప్రొడక్షన్స్‌, ఏసియన్ సినిమాస్‌ గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాయి.

Advertisement

కెప్టెన్ మిల్లర్ తెలుగు ట్రైలర్‌ను ఇవాళ సాయంత్రం 6 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు తెలియజేస్తూ ఇప్పటికే కొత్త లుక్ విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. ధనుష్‌, శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌.. ఫైరింగ్‌ మూడ్‌లో ఉన్న లుక్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఇంతకీ ట్రైలర్‌ను ఎవరు లాంఛ్ చేయబోతున్నారనేది తెలియజేశారు మేకర్స్‌. అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేశ్‌ నేడు జరుగనున్న ఈవెంట్‌లో ట్రైలర్‌ను లాంఛ్ చేయనున్నట్టు తెలియజేస్తూ అప్‌డేట్ అందించారు. కెప్టెన్‌ మిల్లర్‌ తమిళనాడుతోపాటు కేరళ, కర్ణాటక, ఓవర్సీస్‌లో తన వాహ చాటుతోంది.

Advertisement

 

విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్‌ స్పూర్తితో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించగా.. కన్నడ స్టార్ హీరో శివరాజ్‌ కుమార్‌ , టాలీవుడ్ నటుడు సందీప్‌ కిషన్‌, నివేదితా సతీశ్‌, అమెరికన్‌ యాక్టర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ ఫేం ఎడ్వర్డ్‌ సొన్నెన్‌బ్లిక్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందించాడు. సత్య జ్యోతి ఫిలిమ్స్‌ తెరకెక్కిస్తున్న కెప్టెన్‌ మిల్లర్ ఆడియో రైట్స్‌ను పాపులర్ మ్యూజిక్ లేబుల్‌ సరిగమ సొంతం చేసుకుంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading